ఢిల్లీలో 12-09-2019న (గురువారం) పరిశ్రమలు,వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన
* 'బోర్డ్ ఆఫ్ ట్రేడ్' సమావేశానికి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలో వృద్ధిని పరుగులు పెట్టించే చర్యల్లో భాగంగా వివిధ రంగాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న భారత ప్రభుత్వం
ఎగుమతులను ఏయే మార్గాల ద్వారా పెంచవచ్చన్న దానిపై నేటి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (బీఓటీ) సమావేశం
హాజరు కానున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్
మన దేశం నుంచి వస్తుసేవల ఎగుమతులను భారీ స్థాయిలో పెంచేందుకు సమావేశంలో చర్చలు
ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, ఎగుమతిదారులు, పరిశ్రమ సభ్యులు తదితర వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిప్రాయాలు వెల్లడించనున్న పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఈ ఉన్నత స్థాయి బోర్డుకు చైర్మన్గా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో పాటు అవసరం లేని ఉత్పత్తుల దిగుమతులకు అడ్డుకట్ట వేసే అంశాలపై కూడా సమాలోచనలు