కాకినాడను హెడ్ క్వార్టర్‌గా కొనసాగించాలి


తూర్పుగోదావరి : కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ బుధవారం కేంద్ర ఉక్కు, పెట్రోలియం - సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై ఆమె ఈ సందర‍్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గాన్ని సందర్శించి.. అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఎంపీ గీతా కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ అసెట్స్‌,  కైర్న్ ఎనర్జీ లిమిటెడ్‌, రిలయన్స్‌ పెట్రోలియం లిమిటెడ్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీల కార్యకలాపాలు కాకినాడ ప్రధాన కార్యాలయంగా (హెడ్ క్వార్టర్) జరుగుతున్నాయని ప్రధాన్‌కు...వంగా గీతా వివరించారు. అయితే కాకినాడ హెడ్ క్వార్టర్‌ను మార్చి వేరే చోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై ఆమె... పెట్రోలియం మంత్రితో చర్చలు జరిపారు. మొత్తం కార్యకలాపాలు కాకినాడ కేంద్రంగా కొనసాగించాలని, కాకినాడను హెడ్ క్వార్టర్‌గా గుర్తించాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అయితే కాకినాడనే హెడ్ క్వార్టర్‌గా గుర్తిస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలోనే మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తానని ఆయన తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు