అథ్లెటిక్స్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థులకు అభినందన

అథ్లెటిక్స్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థులకు అభినందన
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించేలా అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్, ఏపీ గురుకులం కార్యదర్శి శ్రీ. P.రంజిత్ బాషా, IAS అన్నారు. ఇటీవల కర్నాటకలోని ఉడిపిలో జరిగిన సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్ మీట్ లో పతకాలు సాధించిన విశాఖ జిల్లా అరకులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులం విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ.P.రంజిత్ బాషా విద్యార్థులను సత్కరించారు. గురుకులం విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఆనందంగా ఉందని.. భవిష్యత్ లో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. గిరిజన విద్యార్థుల్లో అత్యుత్తమ క్రీడా శిక్షణ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే అరకులో గిరిజన క్రీడాపాఠశాల ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలతో గిరిజన విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. 
ముఖ్యంగా అండర్-14 600 మీటర్ల రేస్ లో శెట్టి లోహిత్, అండర్-14 లాంగ్ జంప్ లో K.నంద కిషోర్, అండర్-16 లాంగ్ జంప్ లో R.సాయి శ్రీనివాస్ వెండి పతకాలు సాధించగా, అండర్-14 100 మీటర్ల రేస్ లో P.పవన్ కుమార్, అండర్-16 800 మీటర్ల రేసులో B.శ్రీకాంత్ నాయక్, అండర్-16 జావెలిన్ త్రో లో S.ముని నాయక్ నాలుగో స్థానం సాధించగా., అండర్-18 2K రన్ లో M.దిల్షాన్ ఏడోస్థానంలో నిలిచి ప్రతిభ చాటినట్లు శ్రీ.P.రంజిత్ బాషా తెలిపారు. కార్యక్రమంలో ఏపీ గురుకులం సంయుక్త కార్యదర్శ్  బాలాజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు