జమ్మలమడుగులో ఏపుగా ఏదిగిన పత్తిపంటను ధ్వంసం చేస్తారా..? : చంద్రబాబు 

తేది 12-09-2019


 


జమ్మలమడుగులో ఏపుగా ఏదిగిన పత్తిపంటను ధ్వంసం చస్తారా..?  


వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ధ్వజమెత్తిన చంద్రబాబు


 కడప జిల్లాలోని బేస్తవేముల గ్రామంలో నల్లబోతుల నాగయ్య అనే సామాన్య రైతు దాదాపు 12 ఏళ్ల నుంచి 5 ఎకరాలు జీవనాధారంగా సాగు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా నిలిచారని పంట పూర్తయ్యాక పొలం ఖాళీ చేస్తామని చెప్పినా కూడా పట్టించుకోకుండా వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అధికారులను, పోలీస్‌లను అడ్డం పెట్టుకొని బోర్‌ను సీజ్‌ చేశారు. పండించుకుంటున్న పత్తి పంటను సర్వనాశనం చేసి రైతు నోటి కాడ పంటను లాగేయడం అమానుషం. తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చిన రోజే ఇలా దాడి జరగడం వైసీపీ ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు అద్దం పడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగడం అన్యాయం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 5,400 దానిమ్మ చెట్లను నరికివేసి భూములను లాక్కున్నారు. తూర్పు గోదావరిలో కొబ్బరి చెట్లను నరికేశారు. కడప జిల్లాలో చీనీ చెట్లను నాశనం చేశారు.  రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగడం హేయం. 


జగ్గయ్యపేటలో బీసీ మహిళపై దౌర్జన్యాన్ని ఖండించిన చంద్రబాబు: 


 100 రోజులకే జగన్‌ పాలన 300 దాడులు 600 బెదిరింపులతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. దళితులు, బడుగు బలహీన వర్గాలను టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడటం అన్యాయం. జగ్గయ్యపేటలో వడ్డేర వర్గీయులైన బత్తుల నరసమ్మ కుటుంబాన్ని వైసీపీ నాయకులు బెదిరింపులు గురిచేయడం దుర్మార్గం. రేషన్‌ కార్డులు,  ప్లాట్లు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలపై ప్రభుత్వం చేస్తున్న దాడులు, బెదిరింపులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తాం.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు