కేఆర్ పురం ఐటీడీఏలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా

కేఆర్ పురం ఐటీడీఏలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా                                                                             విజయవాడ : గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పాఠశాలల్లో సౌకర్యాల వంటి కార్యక్రమాలను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని కే.ఆర్ పురం ఐటీడీఏలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా  రంజిత్ బాషా పలు గ్రామాల్లో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికారులను ఆరా తీయడం జరిగింది. తొలుత జంగారెడ్డి గూడెంలోని గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్ ను ఆయన సందర్శించారు. అక్కడ వసతి, వంటగదిని పరిశీలించారు. హాస్టల్ లో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాల్సిందిగా పీవోను ఆదేశించారు. అనంతరం బుసరాజుపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకులం మరియు బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
తన పర్యటనలో భాగంగా రంజిత్ బాషా కే.ఆర్ పురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. శిక్షణ అందుతున్న విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న శిక్షణ, సౌకర్యాలపై రంజిత్ బాషా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్న జూట్ బ్యాగుల తయారీ, వెదురు ఉత్పత్తులు, బిస్కెట్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిందిగా పీవోను ఆదేశించారు. అనంతరం కే.ఆర్ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత నూతిరామన్న పాలెంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, కే. బొట్టప్ప గూడెంలోని ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించి సిబ్బంది కొరతపై చర్చించారు. త్వరలోనే అసవరమైన సిబ్బందిని నియమించి విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తామని శ్రీ. P. రంజిత్ బాషా హామీ ఇచ్చారు. పర్యటనలో కే.ఆర్ పురం ఐటీడీఏ పీవో  సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు