దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ : 10-09-2019, 
నెల్లూరు జిల్లా.


*దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం : పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


•  సోమశిల హైలెవల్  కెనాల్  ఫేజ్-2 పనులు త్వరలోనే పూర్తి చేస్తాం..
•  చంద్రబాబు హయాంలో వాన రాదు..నీరు లేదు : మేకపాటి గౌతమ్ రెడ్డి
•  జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉండడం లక్కీ హ్యాండ్ : మేకపాటి గౌతమ్ రెడ్డి
•  ఆత్మకూరు ప్రజలకు నీరిచ్చినప్పుడే నా గెలుపుకు, పదవికి సార్థకత : మంత్రి మేకపాటి
•  ఈ సంవత్సరం ఆఖరులోగా కడప ఉక్కు కర్మాగారం స్థాపిస్తాం
•  ప్రభుత్వ శ్వేతపత్రంపై ఇప్పటివరకూ ప్రతిపక్షం ఆధారాలతో నిరూపించలేదు
•   పారిశ్రామిక అభివృద్ధి నిజమని టీడీపీ రుజువు చేయలేకపోయింది


నెల్లూరు, సెప్టెంబర్, 10 ; ముఖ్యమంత్రిగా జగన్ రాగానే ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో నీటి పరవళ్ళు ఖాయమన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సోమశిల  ప్రాజెక్టు నుంచి కండలేరుకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో  మంత్రి మేకపాటి పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా నెల్లూరు జిల్లాకు చెందిన  ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పాల్గొన్న ఈ నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులన్నీ జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు హయాంలో వర్షం కురవక, నీళ్లు లేని పరిస్థితిని చూశామని అన్నారు. జలవనరుల శాఖ మంత్రే మన జిల్లాకు చెందిన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అవడం మనకు లక్కీ హ్యాండ్ అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పూర్తయితే జిల్లాకు మరింత మంచి జరుగుతుందని, రాయలసీమ, మెట్ట ప్రాంతాలతో సహా రాష్ట్రమంతటా తాగు, సాగు నీరుకు లోటు ఉండదని మంత్రి మేకపాటి తెలిపారు. తమ కుటుంబం ముందు కలువాయి మండలంతోనే అనుబంధం ఉండేదని, అనంతరం మెట్ట ప్రాంతాలైన అనంతసాగరం, ఉదయగిరి, మర్రిపాడు మండలాల ప్రజలతో ప్రత్యేక బంధం ఏర్పడిందని మంత్రి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతాలు తన తండ్రిగారైన మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, చిన్నాన్న, ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి చెందాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదన్నారు మంత్రి. నెల్లూరు జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  తన పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే రెండు సార్లు శ్రీశైలం నిండి సోమశిలకు నీరు చేరడం నిజంగా ఆయనది లక్కీ హ్యాండ్ అని అభిప్రాయపడ్డారు. ఆ లక్కీ హ్యాండ్ తోనే  సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్-1, ఫేజ్ -2 పనులు పూర్తి చేసి ప్రారంభించాలని మంత్రి మేకపాటి కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో   ఈ విషయంపై చర్చించానని, అందుకు ముఖ్యమంత్రి ఫేజ్ -2 పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని తనతో చెప్పిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందించే అన్ని ప్రాజెక్టులు ఐదేళ్లలో పూర్తవుతాయని మంత్రి అన్నారు. గతంలో ఎన్నో సార్లు సోమశిల ప్రాజెక్టును పరిశీలించినపుడు ఎప్పుడు ఇంకిపోయేదని, కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లపాటూ ప్రాజెక్టులు గేట్లు ఎక్కిపారడమే ఉంటుందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు తాను మాట ఇచ్చినట్లే చివరి ఆయకట్టుకు నీరందించినప్పుడే తాను ఎమ్మెల్యేగా గెలిచినందుకు, మంత్రి పదవి చేపట్టినందుకు ఒక సార్ధకతగా భావిస్తానని మంత్రి మేకపాటి పునరుద్ఘాటించారు. ఇరువురు మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన జిల్లా,  మండల స్థాయి నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో  తరలిరావడంతో సోమశిల ప్రాజెక్టు సమీపంలో పండుగ వాతావరణం నెలకొంది.


సోమశిల నుంచి కండలేరుకు నీటి విడుదల కార్యక్రమం అనంతరం అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 5 లక్షలకు పైగా యువతకు ఉద్యోగాలించిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న సంక్షోభ సమయంలో మన రాష్ట్రంలో మాత్రం ఆ స్థాయి ఉద్యోగాల కల్పన జరగడం ముఖ్యమంత్రి జగన్ అంకితభావం వల్లే సాధ్యమైందన్నారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా, యువతకు ఇబ్బందులు కలగకుండా సచివాలయం పరీక్షలను పకడ్బంధీగా వారం రోజుల పాటు నిర్వహించిన  జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారన్నారు. అధికారుల కృషి, వారి సమన్వయం వల్లే ఇది సాధ్యపడిందన్నారు మంత్రి. గత ప్రభుత్వం పనితీరు, పరిశ్రమల శాఖలో జరిగిన అవకతవకలను ప్రజల ముందుంచడానికి ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం విడుదల చేశాం. కానీ, ఆ శ్వేత పత్రంపై అర్థం లేని మాటలు, కప్పిపుచ్చుకునే ధోరణితో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారే తప్ప, రుజువు చూపలేకపోయారని మంత్రి ఆరోపించారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్నపుడు తనతో పాటు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారితో జరిగిన సంభాషణను మంత్రి మీడియా ముందు వివరించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని అడగాలని వెళ్లినపుడు ఓ కాగితం చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండగా హోదాతో పనేముందని ప్రశ్నించినట్లు ఆ అధికారి చెప్పారన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారాలు, లక్షల కోట్ల పెట్టుబడులంటూ అబద్ధాలు చెప్పడం వల్ల చాలా నష్టం జరిగిందని చర్చిచారన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఆ విషయంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాల వల్ల కేంద్ర ప్రభుత్వం సాయం చేయదని జగన్ సూచనలు చేసినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. కియాకు ఇచ్చిన పాలసీని మేం వ్యతిరేకిస్తే కియాకు వ్యతిరేకమనే ప్రచారం చేశారని మంత్రి ఆరోపించారు. త్వరలోనే నవ్యాంధ్రకు పరిశ్రమలు తరలి వచ్చేలా పాలసీని తీసుకురానున్నామని మంత్రి తెలిపారు.  గత ప్రభుత్వపు దొంగ ఎంవోయూల వలె కాకుండా నిజాయతీగా పెట్టుబడిదారులను రప్పిస్తామన్నారు. 2020లో రిలయన్స్ సంస్థ కమర్షియల్ గ్యాస్ ప్రాడక్ట్స్ కు సంబంధించిన వ్యాపారంలోకి దిగబోతున్నారన్నారు. ఈ నెల 13న నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ తో జరగనున్న సమావేశంలో రిలయన్స్ గ్యాస్ ప్రాడక్ట్స్ లో మన రాష్ట్రానికి తప్పనిసరిగా వాటా ఇవ్వాలని కోరతామని మంత్రి అన్నారు. గతంలో గ్యాస్ లేక కొన్ని పరిశ్రమలు వెళ్లిపోయాయని, అవి జరగకుండా ఇపుడు చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కలంగా గ్యాస్ నిక్షేపాలు, మిగులు విద్యుత్ వంటి చర్యల వల్ల త్వరలో కరెంట్ రేటు కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదన్నారు. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయన్నారు. అందుకే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేక కోటా కావాలని కోరతామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా త్వరలోనే 2025 వరకూ చేపట్టవలసిన ప్రాజెక్టుల వంటి వివరాలను ప్రాధాన్యత క్రమంలో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అందుకు తగ్గ విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి వివరించారు. డిసెంబర్ 26 లోపు కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వం స్థాపిస్తుందన్నారు మంత్రి మేకపాటి. పారిశ్రామిక విధానం మెరుగుపడాలంటే పాలసీ విధానం ముఖ్యమన్నారు. ఓపెన్ ట్రాన్పరెంట్ పాలసీయే ఎజెండాగా అందరికీ ఆమోదయోగ్యమైన, సమ ప్రాధాన్యతనిచ్చే విధానాలకు పెద్దపీట వేసి పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరుస్తామని మంత్రి అన్నారు.


 


Popular posts
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
శ్రామిక జాతికి  మే డే దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చారిటబుల్.ట్రస్ట్, మే డే.శుభాకాంక్షలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image