_రెండు రోజుల మైనారిటీ రుణాల అవగాహన సదస్సు ప్రారంభించిన కృష్ణ కలెక్టర్_


    _రెండు రోజుల మైనారిటీ రుణాల అవగాహన సదస్సు ప్రారంభించిన కృష్ణ కలెక్టర్_ 


    విజయవాడ:     కేంద్ర ప్రభుత్వం  మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేయబడుతున్న వివిధ ప్రభుత్వ పథకాల పై మైనారిటీ లబ్ధిదారులకు రెండు రోజుల అవగాహన సదస్సు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజయవాడ హోటల్ మనోరమ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నాడు ప్రారంభించారు. మైనార్టీ రుణాలను ఎలా పొందాలో మైనారిటీ వర్గాలు కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్ల కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయా వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెప్పారు ఈ అవగాహన సదస్సుల వల్ల ఏ ఏ పథకానికి ఏ విధంగా పొందవచ్చును అనే వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రఘు మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు స్వయం కృషి ద్వారా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు. తమ సంస్థ ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నా మన్నారు. మహిళలు గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందవచ్చునని అదేవిధంగా విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లో ఈ సంస్థ డైరెక్టర్  సిరాజుద్దీన్ మరియు మైనారిటీ మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు