రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకోసారి రహదారి భద్రత కౌన్సిల్ స‌మావేశాలు 

రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకోసారి రహదారి భద్రత కౌన్సిల్ స‌మావేశాలు 
* రాష్ట్రస్థాయి తొలి సమావేశంలో మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) వెల్ల‌డి
అమరావతి: రాష్ట్ర ప్రజల ప్రాణరక్షణకై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి రహదారి భద్రత తొలి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. గురువారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాకులోని సమావేశ మందిరంలో రహదారి భద్రత తొలి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమావేశంలో 12 అంశాలపై వివిధ శాఖాధిపతులు, లారీ ఓనర్ల అసోసియేషన్లు తదితరులతో కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. ప్రజాహితం కోసం మానవతా దృక్పథంతో తమ అమూల్యమైన సందేశాలను అందించిన అధికారులు, అసోసియేషన్ అధిపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాలు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకోసారి నిర్వహంచే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, వివిధ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు