గ్రేడ్ వన్ సాధనకు కృషి చేసిన గూడూరు ఎం.ఎల్.ఎ,ఎం.పి మరియు నాయకులకు చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు

💥గూడూరు💥


గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ సాధించిన సందర్భంగా కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరి హరిశ్చంద్రా రెడ్డి తన స్వగృహంలో విలేకార్లు సమావేశం ఏర్పాటు చేసి గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ సాధనకు కృషి చేసిన గూడూరు ఎం.ఎల్.ఎ,ఎం.పి మరియు నాయకులకు చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలిపారు,
గ్రేడ్ వన్ సాధించాలంటే జనాభా ప్రాతిపదికన  లక్ష వరకు జనాభా,మరియు 6 కోట్లు వరకు, టాక్స్ బ్రాకెట్ లో మనం గ్రేడ్ వన్ సాధించామని చుట్టుపక్కల గ్రామాలైన చెన్నూరు, దివిపాలెం, పోటుపాలెం, పురిటిపాలెం లాంటి పంచాయతీ లు కలుపుకుని లక్ష జనాభా ఐతే మలి అడుగు సాధించి కేంద్ర ప్రభుత్వ అమృత పథకం సాధించు కుంటే ఎన్నో నిధులు వచ్చి గూడూరు అభివృద్ధి చెందుతుందని అలాగే ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ 5,6 మున్సిపాలిటీలను అమృత పథకంకి రెఫర్ చేస్తుందని దాన్లో ఐనా మన గూడూరు మలి అడుగు వేస్తామని అలాగే గ్రేడ్ వన్ సాధనకు మొదలుపెట్టిన రెండు నెలల్లోనే గ్రేడ్ వన్ సాదించుకోవడం ఆనందంగా ఉందని గ్రేడ్ వన్ వలన మౌలిక వసతులు పెరిగి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు వస్తాయని చెప్పారు...


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు