వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకంపై వాలంటీర్లకు అవగాహన

వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకంపై వాలంటీర్లకు అవగాహన


వింజమూరు:


పేద, నిరుపేద వర్గాలకు చెందిన ప్రజలు సభ్యులుగా ఉండే స్వయం సహాయక గ్రూపుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై వాలంటీర్లు అవగాహన కలిగి లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని వెలుగు కమ్యూనిటీ కో- ఆర్డినేటర్ వెంకట రమణమ్మ కోరారు. శుక్రవారం వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆవరణలోని వెలుగు భవన సముదాయంలో వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకం తీరు తెన్నులపై వాలంటీర్లకు అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ రత్నాల పధకంలో భాగంగా గ్రామ, పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల సాధికారితకు, ఆర్ధిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఈ పధకమును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు అప్పులను సక్రమంగా చెల్లించుట ద్వారా సంఘాలపై గత బ్యాంకు రుణ భారాన్ని తగ్గించవచ్చునన్నారు. తద్వారా ప్రభుత్వం నూతనంగా అందజేయనున్న వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకమును పేదల దరి చేర్చి వారికి ప్రభుత్వ ఫలాలను అందించి ఆర్ధికంగా చేయూతనిచ్చే దిశగా కృషి చేయాలని వెంకట రమణమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు కార్యాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు