డిపాజిట్ల పై కన్ను వేసిన ప్రస్తుత  ఈవో సురేష్ బాబు - పోతిన మహేష్

అర్హత లేని వ్యక్తి కోసం అమ్మ స్థాయిని తగ్గిస్తారా
అమ్మవారి  ఫిక్స్డ్ డిపాజిట్ల పై కన్ను వేసిన ప్రస్తుత  ఈవో సురేష్ బాబు - పోతిన మహేష్
 
  విజయవాడ:        ఆదివారం వన్ టౌన్ గణపతి రావు రోడ్డులో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పై ఈవో గా బాధ్యతలు  నిర్వహించాలంటే వారికి తప్పనిసరిగా ఆర్.జె.సి క్యాడర్ ఉండాలని ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ.వో. సురేష్ బాబు గారి అర్హత చాలదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నందు పిటిషన్ విచారణలో ఉండగా ఎండోమెంట్ శాఖ అక్రమంగా వారం రోజుల్లో మూడు రకాలైన ఉద్యోగ స్థాయిని  ఈవో సురేష్ బాబు గారికి ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు సెక్రటరీ గారు పేర్కొన్నారని దానిలో నవంబర్ 2న జాయింట్ కమిషనర్ గా, నవంబర్ 6న తాత్కాలిక డిప్యూటీ కమిషనర్ గా మరియు  నవంబర్ 7న సెక్రటరీ ఉషా రాణి గారు జీవో నెంబర్ 891 మార్పు చేస్తూ డిప్యూటీ కమిషనర్ గా చూపించడం అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎంత గుడ్డిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతికి కొమ్ము కాస్తున్నారో  అర్దమవుతుందని అదేవిధంగా ఒక అర్హత లేని వ్యక్తి కోసం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కనకదుర్గమ్మ వారి స్థాయిని తగ్గించి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుందని ఇదంతా దేనికోసం  చేస్తున్నారో మంత్రి  సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. అమ్మవారికి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పై కన్ను వేసిన ప్రస్తుత  ఈవో సురేష్ బాబు  దేవస్థాన అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముసుగులో ఫిక్స్డ్ డిపాజిట్ల విత్ డ్రా చేయాలని ఒక కొత్త  మోసానికి తెరలేపారని అందుకే గతంలో జీతాలు, ఖర్చులు చెల్లించకుండా ఆ డబ్బు మొత్తాన్ని  ఫిక్స్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో జమ చేసారని ఒక కొత్త వాదాన్ని తెరమీదికి తీసుకొచ్చారన్నారు. అమ్మవారి  స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసి అమ్మవారి  ఆదాయానికి, ఆస్తులకు గండికొట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారి భక్తులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని  మహేష్ హెచ్చరించారు. వైయస్సార్సీపి మంత్రులు, ఎమ్మెల్యేలు పాలన చేతకాక ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాడుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారిపై  విమర్శలు చేస్తున్నారన్నారు,.వైయస్సార్సీపి ప్రభుత్వం  ఇసుక వారోత్సవాలు కు బదులు ఇసుక  మాఫియా వారోత్సవాలు చేసుకోవాలని, ఇసుక కొరతను సృష్టించి వైఎస్ఆర్సిపి నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను చూసి కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చలించడంలేదని   ముఖ్యమంత్రి గారికి నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులకు నెలకు పది వేల రూపాయల చొప్పున ఐదు నెలలకు ఆర్థిక సాయం చేయాలని టన్ను ఇసుకను 100 రూపాయలకే అందించాలని డిమాండ్ చేశారు.
 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు