13న టూరిజం ఇన్వెస్టర్స్‌ అండ్‌ స్టాక్‌ హోల్డర్స్ మీట్‌

మరింత అభివృద్ధిపథంలో టూరిజం శాఖ


• 13న టూరిజం ఇన్వెస్టర్స్‌ అండ్‌ స్టాక్‌ హోల్డర్స్ మీట్‌


విజయవాడ, నవంబర్‌ 12: పర్యాటకంగా రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13న అమరావతి(వెలగపూడి) సచివాలయంలో టూరిజం ఇన్వెస్టర్స్‌ అండ్‌ స్టాక్‌ హోల్డర్స్ మీట్‌ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌(ఏపీ ఛాంబర్స్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) కీలకోపన్యాసం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ఆవశ్యకతను ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.ప్రవీణ్‌కుమార్‌,  అలాగే టూరిజం పాలసీలపై ఏపీ ఛాంబర్స్‌ టూరిజం కమిటీ చైర్మన్‌ కె.లక్ష్మీనారాయణ వివరించనున్నారు. అలాగే టీటీఏఏ ప్రెసిడెంట్‌ కె.విజయమోహన్‌, హెచ్‌ఆర్‌ఏఏపీ ప్రెసిడెంట్‌ ఎస్‌.ప్రశాంత్‌, ఏపీహెచ్‌ఏ ప్రెసిడెంట్‌ టి.సత్యనారాయణ, ఏపీఏఏ ప్రెసిడెంట్‌ తరుణ్‌కాకానీ, కల్చరల్ సెంటర్‌ సీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి తదితరులు సలహాలు, సూచనలు అందించనున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు