డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ 

డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ 


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు



వచ్చేనెల   28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ని ర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.
సోమవారం నాడు  స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ ఉత్సవ్ పోస్టర్ ను  విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఉత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.
 విశాఖ నగరానికి, జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి ముంబై నగరం ఎలాగో, ఆంధ్ర ప్రదేశ్ కు వైజాగ్ అలాంటిదని ఆయన తెలిపారు.
విశాఖ ఉత్సవ్ ను ప్రతిరోజు లక్షమంది పర్యాటకులు సందర్శించే లా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.


  భీమిలి  ఉత్సవాన్ని ప్రతిరోజు దాదాపు  30 వేల మంది  సందర్శించారని తెలిపారు.
ఉత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఉంటుందని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక,  నోవాటెల్ హోటల్ ఎదురుగా జాతర వేదికను, స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా వైయస్సార్  సిటీ సెంట్రల్ పార్క్ లో మరొక వేదికను  ఏర్పాటు చేసినట్టు  తెలిపారు.
స్థానికుల మనోభావాలు గౌరవించేలా, గుర్తించేలా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో  ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కార్నివాల్లో 10 వేల మంది విద్యార్థులు, 500 మంది జానపద కళాకారులు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శిస్తామని తెలిపారు.
ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పర్యాటకులు చూసేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను,  ఫుడ్ కోర్టులను, ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలోని యువత వేడుకల్లో పాల్గొనేలా బాక్సింగ్, బాడీ  బిల్డింగ్,
కబాడీ, బీచ్ వాలీబాల్ క్రీడలలో పోటీలను నిర్వహించి, విజేతలకు  బహుమతులు ఇస్తామని తెలిపారు.
ఆధ్యాత్మిక  పర్యాటకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నమూనాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎకో  టూరిజం ప్రోత్సహించడానికి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా  స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏటికొప్పాక బొమ్మలు, అరకు కాఫీ,  అనకాపల్లి బెల్లం, మాడుగుల హల్వా, చింతపల్లి చింతపండు    స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు


పర్యాటకుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ,  టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రైవేటు  టూరు ఆపరేటర్ల  సహకారంతో ప్రత్యేక సిటీ టూర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నగరంలోని అన్ని పర్యాటక స్థలాలను సందర్శించడానికి ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.
బీచ్ రోడ్డులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు  తెలిపారు.
ఇతర జిల్లాలు, రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న విశాఖ వాసులు  ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు.


 వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.


జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.


నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా మాట్లాడుతూ ఉత్సవాలను సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు,  యు వి రమణ మూర్తి రాజు, కరణం ధర్మశ్రీ, కె. భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


పర్యాటక శాఖ ప్రాంతీయ  సంచాలకులు రాధాకృష్ణమూర్తి, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి ఇతర అధికారులు పాల్గొన్నార


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు