ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేసిన APMWO..

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు వ్యక్తం చేసిన APMWO..



కడప. నవంబర్ 21, (అంతిమతీర్పు) :                 నగరంలోని ఆంధ్ర ప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు తన్వీర్ అహ్మద్ షేక్  విలేఖరుల సమావేశం నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా సభలో ముస్లింల డిమాండ్లను నెరవేర్చాలని శాంతియుతంగా ప్లేకార్డుల ద్వారా నిరసన తెలిపిన నంద్యాలకు చెందిన 9 మంది యువకులను అరెస్టు చేసి దేశద్రోహం కేసులు పెట్టి వేధించారు. గత ఎన్నికల్లో అఖండ విజయంతో రాష్ట్రంలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నేడు వారిపై కొనసాగుతున్న కేసులను ఉపసంహరిస్తూ ఏ.పి ప్రభుత్వం G.O.R.T: 988 విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా గారికి అభినందనలతో కృతజ్ఞతలు తెలుపుతూ గత ప్రభుత్వం ఈ తొమ్మిది మంది యువకులను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా ఎంతో మనోవేదనకు గురైన వీరిని ప్రభుత్వం తరఫున జీవనోపాధి కొరకు సహాయ సహకారాన్ని అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్నీ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ షబ్బీర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఫ్వాన్ బాషా, కడప జిల్లా అధ్యక్షులు షఫీఉల్లా ఖాన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు