గవర్నర్ జోక్యం చేసుకోవాలి

గవర్నర్ జోక్యం చేసుకోవాలి          
*ఏపీయుడబ్ల్యూ జే వినతి * గవర్నర్ ను కలసి వినతిపత్రం అందజేసిన నేతలు
 మీడియా స్వేచ్ఛ కి భంగం కలిగించే జీఓ నెంబర్ 2430 ని రద్దు చేయాలన్న డిమాండు విషయంలో రాజ్యంగా పరిరక్షణకులు అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే) కోరింది. ఆమేరకు గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ ని యూనియన్ నేతలు కలసి వినతిపత్రం అందజేశారు. ఐజెయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, చిన్నమధ్యతరహా పత్రిక సంగం అధ్యక్షుడు నల్లి ధర్మారావు, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, తదితరులు గవర్నర్ ని కలిశారు. తొలుత గవర్నర్ కి జీఓ వలన మీడియా స్వేచ్ఛ కి ఏవిధమైన ముప్పు ఉందొ యూనియన్ నేతలు వివరించారు. ఈ జీఓ విషయం తన దృష్టికి వచ్చిందని పిసిఐ చైర్మన్  కూడా   స్పందించటాన్ని కూడా ఈ రోజు పత్రికలలో చూసాను అని గవర్నర్ యూనియన్ నేతలతో అన్నారు. గతంలో2007 అప్పటిముఖ్యమంత్రి వై ఎస్ రాజాశేఖర్ రెడ్డి జీఓ 938 ని తీసుకొని వచ్చరని, దానిని అప్పుడు కూడా వ్యతిరేక కించడం తో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీఓ ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారని, జీఓ ను రద్దు చేయకపోయినా వినియోగించలేదని యూనియన్ నేతలు గవర్నర్ దృష్టి కి తెచ్చారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీఓ 2430 చాలా  ప్రమాదకరంగా ఉందని,  తక్షణమే ప్రభుత్వం జీఓ ని ఉపసంహరించుకొనే విధంగా చూడాలని యూనియన్ నేతలు గవర్నర్ ను కోరారు. దేశంలోని జర్నలిస్టుల సంఘాలు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాస్వామ్యక వాదులు, వివిధ రాజకీయ పార్టీలు ఈ జీఓ ను  వ్యతిరేకేస్తున్నారని గవర్నర్ కి తెలిపారు. ఆమేరకు వివరాలు తో కుడి న వినతిపత్రం ని గవర్నర్ కి యూనియన్ నేతలు అందజేసారు. తప్పకుండా పరిశీలిస్తాన్ని గవర్నర్ హామీ ఇచ్చారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు