అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం.
తాడేపల్లి
నవంబర్ 04.


పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి,సత్తెనపల్లి శాసనసభ్యుడు శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ 


-నదులు పొంగిప్రవహిస్తున్నాయని పదే పదే చెప్పాం.అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం అని తెలియచేశాం.


-వరదలు తగ్గాక ఇసుకతీయడం సాధ్యం కాదని చెప్పాం.


-మూర్ఘుల మనస్సులను రంజింపచేయలేం.


-విశాఖలో పవన్ కల్యాణ్ లా...0గ్ మార్చ్ చేశారు.


-అందులో భవననిర్మాణకార్మికులు కనిపించలేదు.


-అందులో జనసేన జెండాలుపట్టుకున్న టిడిపి కార్యకర్తలు కనిపించారు.


-ఆ రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారు.అది టివిలలో చూశాం.


-పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు మీరు నడుపుకుంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు.


-డిఎన్ ఏ అంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు.డిఎన్ ఏ అంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల వ్యక్తిగతమైనది కాదు.


-మళ్లీ చెబుతున్నాను టిడిపి,జనసేన డిఎన్ ఏ ఒక్కటే.


-నిన్న మీరు తాటతీస్తామన్నారు.మీరు రెండు చోట్ల నిలబడితే ప్రజలు తాటతీశారు.మీరు మూలన కూర్చోబెట్టారన్నారే.కాదు మూలనకాదు... కూర్చోబెట్టారు...వంగోబెట్టారు...


-తాటతీయడం అంటే ఆరునెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదు.రాజకీయంగా తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టే కాదు ఎవరూ సిద్దంగా లేరు.


-మీ నోరు పెద్దది మీ నోరు కన్నా వేయిరెట్లు పెద్దది మా నోరు గుర్తుపెట్టుకోండి.


-ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తానంటే ప్రజలే మిమ్మల్ని తాటతీస్తారు.తాటిచాపచేస్తారు.దయచేసి మీరు మరిచిపోవద్దు.


-రాజకీయాలలో విమర్శలు చేయండి అవి సద్విమర్శలు చేయాలిగాని వ్యక్తిగతంగా ఉండకూడదు.


-మా వ్యవసాయమంత్రి కన్నబాబుగారిని ఏం మాట్లాడుతున్నారు.మీరు కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని మీరు కోరితే తుక్కుతుక్కుగా మిమ్మల్ని ఓడించారు.కన్నబాబును గెలిపించారు.


-కన్నబాబు మీ పార్టీలో ఉండిఉండవచ్చు.మీ అన్నగారి పార్టీలో  టిక్కెట్టు ఇచ్చిఉండవచ్చు.అందులో 18 మంది గెలిస్తే వారిలో కన్నబాబు ఒకరు.


-కన్నబాబుపై మీకు హక్కు లేదు.ఈ రాష్ర్టానికి మంత్రిగా ఉన్న కన్నబాబును ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తారా.కన్నబాబు కధ అంతా తెలుసంటారా ఏం తెలుసు మీకు.


-విజయసాయిరెడ్డిగారి గురించి మీరు మాట్లాడారు.రెండున్నరేళ్లు జైలులో ఉన్నారని ,
వారికి మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని,జగన్ గారు కూడాప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని
ఇవన్నీ మీ మాటలు కాదు.అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడు స్ర్కిప్ట్ తీసుకువస్తే చదివే దౌర్భాగ్యపరిస్ధితి .


-ఇంతకుముందు టిడిపి వాళ్లు కూడా అన్నారు.వారందరికి తెలియచేస్తున్నా. జగన్ గారు కేవలం నేరారోపణ చేయబడ్డ వ్యక్తి.16 జైలులో ఉన్నవ్యక్తి.ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి.ఇవన్నీ తెలిసే ప్రజలు ఎన్నికలలో 151 సీట్లలో గెలిపించారు.


-రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిగారి గురించి అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదు.


-రాజకీయంగా వందవిమర్శలు చేయండి వాటికి సమాధానం చెబుతాం.


-చంద్రబాబు సత్తా అయిపోయింది.రాజకీయంగా దాడులు చేయడానికి చేస్తున్నారు అయినా స్పందన రావడం లేదు.


-ఆ మద్య లోకేష్ తో దీక్ష చేయించారు.దానికి సైతం స్పందన లేదు.దాంతో లాంగ్ మార్చ్ పెట్టారు.


-చంద్రబాబు ఎజెండాను మోయడం కోసం మీరు రాజకీయం నడుపుతున్నారు.


-మీ అభిమానులు కూడా జగన్ గారికి ఎందుకు ఓట్లు వేశారంటే మీకు ఓట్లు వేస్తే సైకిల్ కు ఓటు వేసినట్లేనని భావించి మాకు వేశారు.


-చంద్రబాబు ,పవన్ కల్యాణ్ భుజంపై తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చాలని ప్రయత్నం చేస్తున్నారు.


-పవన్ కల్యాణ్ , రాజకీయాలలో మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లండి.


-మాకు సిధ్దాంతం ఉంది మాకు నైజం ఉందంటున్నారు.ఏంటి మీ సిధ్దాంతం కూలిపోయిన తెలుగుదేశం భవనాన్ని తిరిగి నిర్మించాలనే ప్రయత్నమే మీ సిధ్దాంతం.


-ఢిల్లీలో ఉండే నేతలతో మాకు సంబంధాలు ఉన్నాయి.పలుకుబడి ఉంది అంటారు.పలుకుబడి ఉంటే రాష్ర్ట అభివృధ్దికి కృషి చేయండి.


-ఓ పక్క బిజేపి తో సంబంధాలు నెరుపుతూనే వామపక్షాలతో మాట్లాడుతుంటారు.వారితో కలసి పోటీచేస్తారు.


-మాపై కుట్రతో కేసులు పెట్టారని బావించి ప్రజలు మమ్మల్ని గెలిపించారు.


-పవన్ కల్యాణ్ గారు మీ పార్టీని నడుపుకునే శక్తి లేకపోతే తిరిగి సినిమాలలోకి వెళ్లండి.


-మీరు సినిమాలలోకి వెళ్లి పనిచేసే పరిస్దితి వస్తుంది.


-జగన్ గారు అద్బుతమైన పరిపాలన అందించడం ఖాయం.అందువల్ల మీకు సినిమాలలోకి వెళ్లే ఆలోచన వస్తున్నాయి.


-జనసేన టిడిపికి బి టీమ్ .చంద్రబాబుకు దత్తపుత్రుడు మీరు.


-జనసేనను,టిడిపిని కట్టగట్టి సముద్రంలో పడేశారు.


-చంద్రబాబుకు 23 సీట్లు కాదు 24 సీట్లు అని తేలిపోయింది.


-భవన నిర్మాణ కార్మికులకోసం వారి సంక్షేమం కోసం పాటుపడతాం.


-ఆరునెలల్లోనే జగన్ గారి ప్రభుత్వాన్ని ఏదో బ్రాండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు