అయ్యప్పలకు అచ్చిరెడ్డి దంపతుల అన్నదానం

*అయ్యప్పలకు అచ్చిరెడ్డి దంపతుల అన్నదానం* వింజమూరు: వింజమూరులోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం 18 వ రోజు సందర్భంగా వెన్నపూస.అచ్చిరెడ్డి-మల్లీశ్వరి దంపతులు మనుమడు ఖుషివర్ధన్ రెడ్డి జన్మదినోత్సవమును పురస్కరించుకుని అయ్యప్ప, గోవింద నామ మాలధారణ భక్తులకు అన్నదానం చేశారు. కార్తీక మాసం ఆరంభం నుండి మాసాంతం ఈ దేవస్థానంలో నిరంతర అన్నదాన కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినంచదగిన విషయమని శ్రీ హరిహర పుత్ర దేవస్థానం ప్రధాన నిర్వాహకులు, గురుస్వామి చేబ్రోలు. వసంతరావు పేర్కొన్నారు. మణికంఠ స్వామి కృపా కటాక్షములు అన్నదాతలకు, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని ఆయన ఆకాం క్షించారు. అనంతరం మాలధారణ భక్తులకు, అన్నదాత కుటుంబ సభ్యులకు అయ్యప్పస్వామి శరణు ఘోషల నడుమ స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఏ.సి.డి.సి ప్రసాద్, చిట్టమూరి.హరీష్, శేగు.పూర్ణచంద్రరావు, వెలుగోటి.క్రిష్ణ, బొగ్గల.మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు......


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు