అవినీతి వ్యతిరేక కవితల పోటీ :డాక్టర్ టి. సేవా కుమార్

అవినీతి వ్యతిరేక కవితల పోటీ


గుంటూరు నవంబర్ 5, (అంతిమతీర్పు) :


“అమరావతి సాహితీమిత్రులు”, “సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్” సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థల సంస్థాపకులు డా. రావి రంగారావు, డాక్టర్ టి. సేవకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 20 పదాలకు మించని పద్య కవిత/వచన కవిత/గేయం ఏదైనా ఒక కవిత మాత్రమే పంపించవలసి వుంటుంది. ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2 వేలు, నాలుగు ప్రత్యేక బహుమతులు రూ.500 చొప్పున ఇవ్వబడతాయి. కవిత వెనకవైపు ఈ పోటీకి కవిత ప్రత్యేకంగా రాసినదని రాసి, చిరునామా, ఫోన్ నంబరు ఇచ్చి సంతకం చేయాలి.   డిసెంబర్ 9 సోమవారం ఉదయం 10 గం.కు గుంటూరు 2/1 బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో జరిగే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ సభలో బహుమతు లందించటం జరుగుతుంది. కవితల్ని నవంబర్ 20లోపు అందేలా “డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్, 5వ లైను తూర్పు, గోరంట్ల, గుంటూరు 522034” అడ్రసుకు పంపాలి.


..... డా. రావి రంగారావు డా. టి.సేవకుమార్ 9247581825


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు