ఎందుకు రాళ్లు వేశారో టీడీపీనే ఆలోచించుకోవాలి : మంత్రి పిల్లి

ఎందుకు రాళ్లు వేశారో టీడీపీనే ఆలోచించుకోవాలి : మంత్రి పిల్లి
గుంటూరు: రాజధాని అమరావతిలో ఎవరైనా పర్యటించవచ్చునని, ఎవరికి ఎలాంటి అడ్డంకులు ఉండవని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్యాయం జరిగిన రైతులే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉంటారన్నారు. ఎందుకు రాళ్లు వేశారో టీడీపీనే ఆలోచించుకోవాలన్నారు. ఏదోఒక విషయంపై ఆరోపణలు చేసి రాజకీయం చేయాలని టీడీపీ ప్రత్నిస్తోందని మంత్రి సుభాష్ విమర్శించారు. చంద్రబాబు చేసిన అన్యాయంతో రైతులు బాధతో రాళ్లు వేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై రాళ్లు వేసిన ఘటనకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాళ్లు వేస్తే వేసి ఉండవచ్చు.. కడుపు మండితే ఎవరైనా వేస్తారన్నారు. రాళ్లు వేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సుభాష్ చంద్రబోస్ అన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు