ప్రమాదపు టంచున వింజమూరు బైపాస్ రోడ్ రెయిలింగ్

*ప్రమాదపు టంచున వింజమూరు బైపాస్ రోడ్ రెయిలింగ్ వింజమూరు: వింజమూరు బైపాస్ రోడ్డు పరిస్థితి మూన్నాళ్ళ ముచ్చటగా మారుతున్నది. వింజమూరులో రోజు రోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా యర్రబల్లిపాళెం చెరువు కట్టపై దాదాపుగా 7 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బైపాస్ రోడ్డు వేయడం జరిగింది. అప్పట్లో రోడ్డు కాంఫాక్షన్ పనులు సక్రమంగా జరగలేదనే విమర్శలు కూడా వినిపించాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి ప్రస్తుతం బైపాస్ రోడ్డుకు శాపాలుగా మారాయి. వర్షాలు పడిన సమయంలో చెరువు కట్టకు ఒక వైపున భారీ స్థాయిలో కట్ట భాగం కోతలకు గురైంది. పై నుండి క్రింది వరకు ఏర్పడిన కోతలు భయానక వాతావరణమును కల్పింపజేస్తున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మాణం సుధీర్ఘ కాలం సాగినా దీర్ఘకాలికంగా బైపాస్ రోడ్డు ఉంటుందా అనే అనుమానాలను ప్రయాణీకులు వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట కోతలకు గురవుతుండటంతో రెయిలింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రెయిలింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు కార్యాలయాలను వీడి క్షేత్ర స్థాయిలో పర్యటించి రోజు రోజుకూ దెబ్బతింటున్న వింజమూరు బైపాస్ రోడ్డు పై దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతగా వ్యవహరించకుండా సత్వర చర్యలు చేపట్ట వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు...


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు