పారిశుధ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి* (హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్)

*పారిశుధ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి* (హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్)


వింజమూరు: గ్రామాలలో పారిశుద్ద్య్హం మెరుగుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కృషి చేయాల్సిన భాధ్యత అత్యంత ఆవశ్యకమని హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్ సూచించారు. శుక్రవారం నుండి మండలంలో ప్రారంభమైన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా వింజమూరులోని రాజీవ్ నగర్, చాకలికొండ గ్రామంలో పారిశుధ్య చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీబీజాన్ ప్రజలకు పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించారు. నివాస గృహాల సముదాయంలో నిల్వ ఉండే నీటిని ఉంచరాదని, స్థానికంగా పేడ దిబ్బలను తొలగించాలని, వ్యాధులకు కారకాలయ్యే పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. కేవలం పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన జీవన విధానం సాధ్యపడుతుందన్నారు. దోమల ఉత్పత్తికి మురికి కూపాలే ప్రధాన కేంద్రాలని, కనుక నివాసాలు, అంతర్గత రోడ్లుపై ఎప్పటికప్పుడు వీటిని తొలగించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, క్షయ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నివారించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు గురించి స్థానిక ప్రజలకు వివరించారు. వీధులలో తిరుగుతూ లార్వా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైధ్యారోగ్యశాఖ సిబ్బంది హరిక్రిష్ణ, గిరి కుమారి, వెంకటేశ్వర్లు రెడ్డి, రాజేశ్వరి, షఫి, ప్రభావతి, వెంకటేశ్వర్లు, అరుణారాణి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు...


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020