తహసీల్దార్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

తహసీల్దార్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి 
తొట్టంబేడు, నవంబర్ 5,అంతిమ తీర్పు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తాసిల్దార్ గా విధులు నిర్వ హిస్తున్న విజయరెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వర స్వామి డిమాండ్ చేశారు . మంగళవారం కార్యాలయంలో యువ తాసిల్దార్ విజయ రెడ్డి మృతికి నివాళులర్పించి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ  రెండు నిమిషాలు మౌనం వహించారు.  అనంతరం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా తహసీల్దార్ పరమేశ్వర స్వామి మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు నిరసన చేపట్టామని పేర్కొన్నారు . ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారులు పైనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు . కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశ్వర స్వామి తో పాటు డిప్యూటీ తహసీల్దార్ శాంతి, 
ఆర్ఐ రవీంద్రబాబు, సర్వేయర్ రవిశేఖర్,  వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు