రాష్ట్ర మంత్రి మండలి సమావేశం– నిర్ణయాలు*

*27.11.2019*
*అమరావతి*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం– నిర్ణయాలు*


1. *జగనన్న విద్యాదీవెన,జగనన్న వసతి దీవెన :* 


జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు  కేబినెట్‌ ఆమోదం
జగనన్న విద్యాదీవెన కింద çపూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
సంతృప్త స్ధాయిలో జగనన్న విద్యాదీవెన అమలు
ఎస్సీ,ఎస్టీతో పాటు బీసీ,కాపు, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు 
వర్తింపచేయనున్న ప్రభుత్వం
ఈసారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ పూర్తి స్ధాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి భోజన,వసతి కోసం ఆర్ధిక సహాయం
ఐటిఐ చదవుకుంటున్న వారికి ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి ఏడాదికి రూ.15వేలు
డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న వారికి ఏడాదికి రూ.20వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం
అర్హుడైన ప్రతి విద్యార్ధికి వసతి, భోజన సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఈ నగదు చెల్లింపు


విద్యార్థుల వసతికోసం గతంలో రూ.500 కోట్లు ఖర్చు, ఈ సారి జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.2300 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం
జగనన్న విద్యా దీవెనకోసం ఏటా రూ.3400 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం. గతంలో రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు


జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి రెండు పథకాల కోసం రూ.5700 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 11,44,490
 నిబంధనల సడలింపు కారణంగా మరింత పెరగనున్న లబ్దిదారుల సంఖ్య 
జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యావసతి పథకాలకోసం నిబంధనలను భారీగా సడలించిన ప్రభుత్వం


ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సంవత్సరాదాయ పరిమితి రూ.2 లక్షలు, మిగతా వాళ్లకి లక్షలోపు ఆదాయం ఉంటేనే ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందనేది గత నిబంధన కాగా,
 తాజాగా ప్రభుత్వం రూ.2.5లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ  జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. 
10 ఎకరాలలోపు మాగాణి గాని లేదా, 25 ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్న వారికీ, లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నవారికి వర్తిస్తుందంటూ నిబంధనలు సడలించింది. 
ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుధ్ద్యకార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.
కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ ఉన్నవారు అర్హులేనని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఆదాయపుపన్ను కట్టేవారిని అనర్హులుగా స్పష్టం చేస్తోంది. 
పట్టణాల్లో 1500 స్క్వేర్‌ ఫీట్‌ స్థిరాస్థి ఉన్నవారికీ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది. 
పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. 


2.
 *వైయస్సార్‌ కాపు నేస్తం*
వైయస్సార్‌ కాపునేస్తంకు కేబినెట్‌ ఆమోదం
కాపు,బలిజ,తెలగ,ఒంటరి, ఉప కులాలకు ఆర్ధిక సహాయం
45–60 ఏళ్ల మధ్యనున్న  మహిళలకు ఏడాదికి  రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు ఆర్ధిక సహాయం
వారి జీవనప్రమాణాలను పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికే ఈ ఆర్ధిక సహాయం చేస్తున్నామన్న మంత్రిమండలి
కాపునేస్తం కోసం ఈ యేడాది రూ.1101 కోట్లు కేటాయింపు
 ప్రతీయేటా రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా
కాపుల సంక్షేమం కోసం ఏడాదికి మొత్తంగా రూ.2వేల కోట్లు కేటాయింపు


3.
 *కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌*
 
కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సంబంధిత అంశాలపై మంత్రులబృందం(జీఓఎం) కు సలహాలు, సూచనల కోసం అధికారుల బృందం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన అటవీ,పర్యావరణ, ఆరోగ్య, పంచాయితీరాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలవిద్యాశాఖ కార్యదర్శలతో కూడిన బృందం
అధికారుల బృందానికి కన్వినర్‌గా వ్యవహరించనున్న ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి


ఫిబ్రవరి 28, 2019న సీపీఎస్‌పై ఏర్పాటైన టక్కర్‌ కమిటీ నివేదికను  పరిశీలించనున్న అధికారుల బృందం
 íసీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి  31 మార్చి 2020లోగా జీఓఎంకు నివేదిక సమర్పించనున్న అధికారుల బృందం


కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన ప్రణాళిక,పాఠశాలవిద్య,పంచాయితీరాజ్, ఆరోగ్యశాఖల కార్యదర్శులతో అధికారుల కమిటీ
ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్న ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి
కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై   30 జూన్‌ 2020లోగా జీఓఎంకు నివేదక సమర్పించనున్న అధికారుల బృందం 


4.
 *ట్రైబల్‌ కమ్యూనిటీ హెల్త్‌ లైజన్‌ వర్కర్స్‌ జీతాల పెంపుదల*
ట్రైబల్‌ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ లైజన్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4000కు పెంపునకు కేబినెట్‌ ఆమోదం
దీనికోసం అదనంగా రూ.14.46 కోట్ల రూపాయల ఖర్చును భరించనున్న ప్రభుత్వం
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జీతాల పెంపుదలకు కేబినెట్‌ ఆమోదం
2652 మందికి లబ్ధి


5. 
 *బియ్యం కొత్త కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం*
అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో బియ్యం కార్డులు జారీ 
బియ్యంకార్డుల జారీకోసం నిబంధనలను సడలించిన ప్రభుత్వం
2008 తర్వాత అర్హతలను మళ్లీ సమీక్షించలేదని, సమీక్ష చేయాలంటూ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
 ఆమేరకు సడలించిన ప్రభుత్వం
గతంలో రేషన్‌ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు. తాజాగా ప్రభుత్వం దీన్ని సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు చేశారు. గతంలో అర్హులై రేషన్‌ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీచేస్తుంది. 


6.
 *ఏపిఎస్‌డిసిఎల్‌ విభజన*
ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ను రెండుగా విభజించేందుకు ప్రభుత్వం అంగీకారం
దీన్ని ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీగానూ, ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలిమిటెడ్‌గా విభజన
దీనికి కేబినెట్‌ అంగీకారం


7. 
*ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్‌ ఆమోదం*



8. 
*నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి కేబినెట్‌ ఆమోదం*
వచ్చే ఉగాదినాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న ప్రభుత్వం
సంతృప్త స్థాయిలో అర్హుల ఎంపిక
కులం, వర్గం, రాజకీయాలతో సంబంధం లేకుండా వివక్షకు తావులేకుండా, పారదర్శక విధానంలో లబ్ధిదారుల ఎంపిక


*9.* 
విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఏపీఐఐసీకి 50 ఎకరాల భూమి కేటాయింపు
పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకోసం భూమి కేటాయింపు 


10.
*నడికుడి – శ్రీకాళహస్తి బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ నిర్మాణంకోసం ద.మ. రైల్వేకు 92.05 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం*


11. 
*ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్‌లో సవరణలు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం*
వీటిని రానున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
మద్యం ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం


12
*కడప స్టీల్‌ ప్లాంట్‌* 
కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం
డిసెంబర్‌ 26న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
జమ్మల మడుగు మండలం సున్నపురాళ్ల పల్లి మరియు పెద్ద నందలూరు గ్రామాల మధ్య శంకుస్థాపన
దీనికోసం ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
స్టీల్‌ ప్లాంట్‌కోసం 3295 ఎకరాల భూమి సేకరణ
ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకోనున్న ప్రభుత్వం


13. 
*ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ పరిధిలోకి ఇంటర్‌ విద్యను చేర్చుతూ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం*
 
*14*.
తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డులో సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 కి పెంచుతూ దేవాదాయశాఖ చట్టంలో సవరణలు కోసం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం


15.
 *షెడ్యూల్ట్‌ కేస్ట్, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌కు వేర్వేరుగా కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం*
ఏపి స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కేస్ట్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌  సవరణకు కేబినెట్‌ ఆమోదం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేర్వేకు కమిషన్ల ఏర్పాటుకు బిల్లు


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.
Image
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం