సీఎం చేతుల మీదుగా పంపిణీ

సీఎం చేతుల మీదుగా పంపిణీ


అమరావతి,:సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ నెల 7న గుంటూరులో చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మొదటి విడతగా రూ.264 కోట్లు విడుదల చేయడంతో తగిన చర్యలు చేపట్టాలని సీఐడీ అధికారులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. విజయవాడ కేంద్రంగా వెలసిన అగ్రిగోల్డ్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని 19.19 లక్షల మందితో రూ.6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించింది. కాల పరిమితి ముగిసిన బాండ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్‌ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఇతర ముఖ్యులను అరెస్టు చేసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని రూ.3,785 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. అత్యధికంగా మన రాష్ట్రంలో రూ.2,585 కోట్ల విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని మూడేళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్‌ దాఖలైంది.
 
హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సీఐడీ మొదలు పెట్టింది. డిపాజిటర్లు ఆందోళనకు దిగడంతో గత ప్రభుత్వం రూ.250కోట్లు ఇచ్చి రూ.5వేల లోపు డిపాజిటర్లకు స్వాంతన చేకూర్చేందుకు యత్నించింది. ఎన్నికల తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం రూ.1,150 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో సీఐడీ అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు అందజేశారు.
ఆ జాబితాను న్యాయకమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బు పంపిణీ చేయబోతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు