కనుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ ఏర్పాట్లు

కనుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ ఏర్పాట్ల.                


విజయవాడ :


స్వరాజ్య మైదానం లో ఈ నెల 18  వ తేదీ సోమవారం షష్ఠి రోజున  శ్రీ వ ల్లి , దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ  ఏర్పాట్లు కనులపండువగా జరుగుతున్నాయి. విశాఖ శారద పీఠాధి పతులు  శ్రీ శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వాములు వారిచే  కళ్యాణం మహోత్సవం, కార్తీక  దీపోత్సవం నిర్వహిస్తున్నారు...  శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా  సమితి, గరిమెళ్ళ నాణయ్య చౌదరి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం ఏర్పాట్లు జరుగుతున్నాయి.. శనివారం సాయంత్రం స్వరాజ్య మైదానంలో కల్యాణ మహోత్సవ అంకురార్పణ జరిగింది. మామిడి లక్ష్మి వెంకట కృష్ణారావు, గరిమెళ్ళ నాణయ్య చౌదరి, దూబగుంట్ల  శ్రీనివాసరావు దంపతులు లక్ష్మి గణపతి  పూజ,  నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపుకొట్టే కాయక్రమంలో పాల్గొన్నారు. మహిళల కోలాటంతో  సందడిగా మారింది. పవిత్ర కార్తీకమాసంలో లోకకల్యాణం, రాష్ట్రాభివృద్ధికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, కోటి దీపోత్స్వమ్ ఏర్పాటు చేయడం ఎంతో శుభకరమని, భక్తులు పాల్గొని  స్వామి వార్ల కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నామని నిర్వాహకులు  గరిమెళ్ళ నాని తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు