నేటి సమాజంలో మహిళలకు ఆత్మరక్షణ పై శిక్షణ అవసరం

నేటి సమాజంలో మహిళలకు ఆత్మరక్షణ పై శిక్షణ అవసరం
ఏబీవీపీ మిషన్ సాహసి కార్యక్రమం గోడ పత్రికను విడుదల


గూడూరు :


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి స్థానిక డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాలలో మిషన్ సాహసి కార్యక్రమం గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈనెల 19వ తేదీన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలలో చదివే విద్యార్థినులకు ఆత్మరక్షణ పై శిక్షణ కార్యక్రమం మిషన్ సాహసి అనే పేరుతో దేశ వ్యాప్తంగా అన్ని కళాశాల కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి లక్ష్మి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం ఇలాంటి శిక్షణలో చాలా అవసరమని అన్నారు ఆత్మరక్షణ పై శిక్షణ ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఏబీవీపీ విద్యార్థి సంఘానికి అభినందనలు తెలిపారు అనంతరం నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఏబీవీపీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు మహిళల పై దాడులు ఎదుర్కోవడానికి ,ర్యాగింగ్ ,
ఈవ్ టీజింగ్ ,పోకిరి నుండి ఎటువంటి ఆయుధాలు లేకుండా ఎదుర్కోవడం పట్ల ఏబీవీపీ ఆధ్వర్యంలో  మిషన్ సాహసి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తున్నామని విద్యార్థులు యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మరక్షణ పై శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తీక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జార్జ్ నగర కార్యదర్శి నగర సహాయ కార్యదర్శి హర్షవర్ధన్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు