పాఠశాల విద్యాశాఖపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష

*అమరావతి*


*పాఠశాల విద్యాశాఖపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష*


*సమీక్షకు హజరైన విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు*


*జగనన్న విద్యా కానుక*


స్టూడెంట్‌ కిట్స్‌
యూనిఫామ్‌ క్లాత్‌ (3 జతలు కుట్టించుకునేందుకు వీలుగా), నోట్‌బుక్స్, షూస్‌ అండ్‌ సాక్స్, బెల్ట్, బ్యాగ్‌కు అదనంగా టెక్ట్స్‌బుక్స్‌ కూడా కలపాలని సీఎం ఆదేశం
కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ పరిశీలించిన సీఎం
కాంపిటీటివ్‌ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్న సీఎం
ఈ ప్రొక్యూర్‌మెంట్, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామన్న అధికారులు
క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వద్దు
నాణ్యమైన కిట్స్‌ విద్యార్ధులకు అందాలి
ఎక్కడా జాప్యం జరగకూడదు, అన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలి


*మనబడి నాడు – నేడు*


పాఠశాలల్లో నాడు నేడు పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను ప్రశ్నించిన సీఎం
ప్రతీ చోటా పనులు ప్రారంభమయ్యాయా అని అధికారులను అడిగిన సీఎం
ఎన్ని స్కూల్స్‌లో పనులు ప్రారంభించారని వివరాలు అడిగిన సీఎం
ఇంకా ఎన్ని పాఠశాలల్లో ఇంకా పనులు మొదలు కాలేదని అడిగిన సీఎం, జాప్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలి
అవసరమైతే సీఎంవో అధికారుల సహకారం తీసుకుని పనులు జాప్యం జరగకుండా ముందుకెళ్లండని అధికారులకు సూచన
విద్యార్ధులకు స్కూల్‌ బిల్డింగ్‌ చూడగానే స్కూల్స్‌కి వెళ్ళాలనే విధంగా లైవ్లీగా ఉండాలి
కాంపౌండ్‌ వాల్‌ నుంచి స్కూల్‌ బిల్డింగ్‌ వరకూ వాడే మెటీరియల్ మరింత ఆకర్షణీయంగా ఉండాలి, విద్యార్ధులను ఆకట్టుకునేలా గోడలపై  డ్రాయింగ్స్‌ ఉండాలి


*జగనన్న గోరుముద్ద*


గోరుముద్ద పధకం ప్రవేశపెట్టిన తర్వాత స్కూల్స్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపిన అధికారులు
విద్యార్ధులకు చిక్కీ కూడా అందుతుందా అని అధికారులను అడిగిన సీఎం, ఇస్తున్నామని చెప్పిన అధికారులు
మానిటరింగ్‌ ఎలా జరుగుతుందని అధికారులను ప్రశ్నించిన సీఎం
గోరుముద్దపై మొబైల్‌ యాప్‌ సిద్దమవుతుందని సీఎంకి వివరించిన అధికారులు, వెంటనే యాప్‌ సిద్దం చేయాలని ఆదేశం
యాప్‌లో మెనూ వివరాలు ఉండాలి, ఏ రోజు ఏ మెనూ ఇస్తున్నామో యాప్‌లో ఉండాలి
ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే యాప్‌లో తెలియాలి, ఆ తర్వాత వెంటనే సంబంధిత ఉన్నతాధికారి సమస్య పరిష్కరించాలి, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి
మానిటరింగ్‌ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి
ఏ స్కూల్‌లో మెనూ తేడా వచ్చినట్లు ఫిర్యాదు అందగానే వెంటనే పరిష్కరించాలి
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కాబట్టి ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం, అజాగ్రత్త వద్దు, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి
మార్పు అనేది విద్య నుంచే ప్రారంభం కావాలి
స్కూల్స్‌లో శానిటేషన్‌ విషయంలో కూడా పక్కాగా ఉండాలి
టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్‌ వివరాలు అధికారులను ఆరా తీసిన సీఎం
టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్, వర్క్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్‌ విషయంలో అధికారుల పనితీరును అభినందించిన సీఎం
మోరల్స్, ఎధిక్స్‌ అనే క్లాస్‌లు కూడా ఉండాలి, విద్యార్ధులకు ఇవి చాలా ముఖ్యం
డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల వివరాలు అడిగిన సీఎం
మానసిక వికలాంగుల కోసం పులివెందులలో వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా నడుపుతున్న విజేత స్కూల్‌ సక్సెస్‌ స్టోరీ అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
మానసిక వికలాంగుల కోసం పులివెందుల విజేత స్కూల్‌ తరహాలో నియోజకవర్గానికి ఒక స్కూల్‌ ఉండాలి
నాడు నేడు పనుల్లో భాగంగా ఈ స్కూల్స్‌ కూడా ఏర్పాటుచేయండి


నాడు నేడు విషయంలో అధికారులు మరింత చొరవ తీసుకుని పనిచేయాలని అదేశం, వచ్చే సమీక్షా సమావేశానికల్లా నాడు నేడు పనుల్లో పురోగతి కన్పించేలా అధికారుల చర్యలుండాలన్న సీఎం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు