నిరాదరణకు గురైన వారికి ఆహార పొట్లాల పంపిణీ . నెల్లూరు: నగరంలోని స్థానిక బారాషహీద్ దర్గా సెంటర్ నందు గురువారం నిరాదరణకు గురై వీధుల్లో రోడ్ల వెంబడి ఉన్న ప్రజలకు నిత్య వాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిత్య వాణి ఫౌండేషన్ కార్యదర్శి బొప్పూరు విజయ మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తిండి లేని అనాధలకు ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగిందని మా సంస్థ దాతల సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో నగర బిజెపి నాయకురాలు కృష్ణమ్మ ,నిత్య వాణి ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఆనంద్, రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు
నిరాదరణకు గురైన వారికి ఆహార పొట్లాల పంపిణీ