హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో సొంత ఊర్లకు పయనమవుతున్న వలస కూలీలు.

*గుంటూరు  ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు) :


హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో సొంత ఊర్లకు పయనమవుతున్న వలస కూలీలు.


కర్నూల్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గుంటూరు జిల్లా కు వచ్చిన వలస కూలీలు.


లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయిన మిర్చి కూలీలు, ఇతర వలస కూలీలు.


తమ ఇబ్బందులను హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకొచ్చిన కూలీలు.


వృద్ధులను, పిల్లలను సొంత ఊరిలో వదిలేసి వచ్చామని తమ గోడును హోంమంత్రి తో చెప్పుకున్నారు.


సానుకూలంగా స్పందించిన హోంమంత్రి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు.


ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత గ్రామాలకు పంపించేందుకు సన్నాహాలు.


కర్నూలు జిల్లా లోని గ్రీన్ జోన్ లో ఉన్న కూలీలను పంపించేందుకు ఏర్పాట్లు.


కోసిగి, దేవరకొండ మండలాలకు చెందిన వలస కూలీల కోసం 8 బస్సులను ఏర్పాటు చేశారు.


మల్లయపాలెం లో 9 బస్సులు, వంగిపురం లో 5, ప్రత్తిపాడు లో  3, మేడవారి పాలెం లో 2 బస్సులను ఏర్పాట్లు చేశారు.


సొంత గ్రామాలకు పంపిస్తున్నందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వలస కూలీలు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు