*కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

*కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం* (వింజమూరు తహసిల్ధారు సుధాకర్ రావు) వింజమూరు, ఏప్రిల్ 12 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) వింజమూరు మండలంలో కొండా.గరుడయ్య, రామచంద్రయ్య, వెంకటసుబ్బయ్య (కే.జి.ఆర్.వి.ఎస్ చారిటబుల్ ట్రస్ట్) ల సేవలు ప్రశంసనీయమని వింజమూరు తహసిల్ధారు యం.వి.కే. సుధాకర్ రావు కొనియాడారు. ఆదివారం నాడు స్థానిక కొండా వారి నివాసం వద్ద పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులైన వంట సరుకులు పంపిణీ చేశారు. యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ మాట్లాడుతూ వింజమూరు మండలంలో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో కే.జి.ఆర్.వి.ఎస్ ట్రస్ట్ విశేష సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా దాతలు సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయాలలో తప్పనిసరిగా అందరూ సమదూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మండలాధ్యక్షుడు గణపం.బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్ధికంగా స్థితిమంతులైన కొండా వంశస్థులు చారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. వై.సి.పి మండల కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి మాట్లాడుతూ కే.జి.ఆర్.వి.ఎస్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు లాక్ డౌన్ సమయంలో రజకులకు, కాలనీవాసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు నిత్యావసరాలు అందజేస్తూ తమ దాతృత్వమును చాటుకుంటూ కీర్తి ప్రతిష్టలు గడిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.వెంకట సుబ్బారావు, కొండా.చిన వెంకటేశ్వర్లు, కొండా.చిన సుబ్బారావు, కొండా.సుమన్, దుగ్గి.మధు, చర్షిత, షామిలి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు