మయూరి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

గూడూరు ఏప్రిల్ 25,(అంతిమ తీర్పు) :    మునిసిపల్ కమిషనర్ గౌ"శ్రీ ఓబులేష్ సూచనలు మేరకు 22 వ వార్డ్,19 వ వార్డులు నందు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు అంతర్జాతీయ మానవ హక్కులు, నేర వ్యతిరేక సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్ ధాతృతమ్తో 70 కుటుంబాలకు కూరగాయలను మునిసిపల్ కమిషనర్ శ్రీ ఓబులేష్ ముఖ్య అథిగా విచ్చేసి పంపిణీ చేయడం జరిగింది. మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని ,అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని మరి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఈ కరోన వైరస్ కోవిడ్ 19 కి ఇంతవరకు మెడిషన్ లేని కారణంగా మనము సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవడం,బూత్రూం కి పోయినప్పుడు సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవడం, ఏదైనా జ్వరం గాని దగ్గు గాని జలుబు గాని ఎక్కువ గా  ఉండినచో మీ సమీపంలో ఉన్న హాస్పిటల్ కు పోయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ,మరియు మాస్కు లు ధరించడం మొదలగున్నవి జాగ్రత్తలు పాటించవలసిన. మనమందరం  ఈ కరోన కివిడ్ 19 వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మునిసిపల్  సిబ్బంది, పోలీస్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది,మరియు వైద్య సిబ్బంది  మరియు ఈ కరోన కోవిడ్ 19 వైరస్ గురించి మనకు సమాచారాన్ని అందించే ప్రింట్ అండ్ ఎల్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరూ ఎంతో శ్రమించుచున్నారు అందువలన అందరికి  అభినందనలు తెలుపు చున్నాను అని మయూరి శ్యామ్ యాదవ్ చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆనంద్,రమేష్,సురేష్, మరియు వాలేంటరీస్ పాల్గొనడం జరిగింది.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు