ల్యాబ్ లు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయం :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*25–04–2020*
*అమరావతి


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


*అమరావతి: 
కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
*క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు, అధికారులు హాజరు.


కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్యరంగంలో మౌలికసదుపాయాలను మెరుగుపర్చుకోవడం చాలా అవసరమన్న సీఎం
గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం.
ల్యాబులు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగు చూసినందున ఒక మంచి అధికారిని అక్కడ పెట్టాలని సీఎం ఆదేశం
ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలన్న సీఎం


నిన్న ఒక్కరోజే 6928 పరీక్షలు చేయించామన్న అధికారులు
ఇప్పటివరకూ 61,266 పరీక్షలు చేసిన ఏపీ 
ప్రతి మిలియన్‌ జనాభాకు 1147 పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీ 


*టెలిమెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశం*
కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్న సీఎం.
టెలిమెడిసిన్‌కు 14410 కు మరింత ప్రచారం కల్పించాలన్న సీఎం


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలన్న సీఎం
అక్కడ పనిచేస్తున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలన్న సీఎం


*జనతాబజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తుందన్న వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు*


*కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పారిశుధ్య కార్యక్రమాలు, కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ప్రజలనుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ*
ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్న  మంత్రి బొత్స
ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం



సమావేశంలో డిప్యూటీ సీఎం అళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలంసాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020