బండారు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో 11వ రోజు నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేత.

    నెల్లూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు) :                         బండారు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో 11వ రోజు నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేత. భారతీయ జనతాపార్టీ మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో , కరోనా వైరస్ మహమ్మారి కరువు నేపథ్యంలో తన వంతు చేయూత గా నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేద ప్రజలకు 11వ రోజు బుధవారం ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా వైరస్ సోకిన వ్యక్తి మరణించక తప్పదు అని తెలిసి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో లాక్ డోన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి దప్పుల పై మనసున్న దాతలు తమ అభయహస్తం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో తన వంతు చేయూత గా , తన సొంత నిధులతో ను మరియు దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో తిరిగి యాచకులు, నిరుపేదలను గుర్తించి వారందరికీ ఒక్కపూట ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో బండారు సురేష్ నాయుడు మిత్రబృందం, తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు