ఎన్.డి.ఆర్.ఎఫ్. శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు కేటాయింపు :కలెక్టర్

నెల్లూరు, తేదీ. 16-4-2020.    
జిల్లా కు 2వేల ట్రూనాట్ మిషన్సు  రావడం జరిగిందని ,   వీటిని హాట్ స్పొట్ లలో వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు తెలిపారు.       గురువారం సాయంత్రం జడ్పీ ఆవరణలోని డిస్ట్రిక్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ వద్ద  జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కు 2 వేల ట్రూనాట్ టెస్టింగ్ ఎక్యుప్మెంట్ రావడం జరిగిందని, వీటిని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వినియోగించి , రేపటి లోగా 2 వేల శాంప్లిల్స్ తీయాలని లక్ష్యం గా నిర్ణయించినట్లు తెలిపారు.ట్రూనాట్ మిషన్ ద్వారా రాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు గంట  నుండి గంటన్నర సమయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేయగా,  ఎన్.డి.ఆర్.ఎఫ్. నుండి శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు రావడం జరిగిందని , వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్  తెలిపారు. కరోనా నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు డివిజన్ స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారి , డిఎస్పీ, డిప్యూటి డి.ఎం. అండ్ హెచ్.ఓ మరియు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ  ఆధ్వర్యంలో  డివిజన్ స్థాయి లోని కంటైన్మైంట్ ప్రాంతాల్లో  ప్రైమరీ, సెకండరీ పర్సన్స్ ను గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలు  సహకరించడం జరిగిందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో    ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు