చరిత్రలో ఈ రోజు   ఏప్రియల్ 24 --- సంఘటనలు

 


 చరిత్రలో ఈ రోజు 


 ఏప్రియల్ 24 --- సంఘటనలు


1704 : మొదటి వార్తాపత్రిక అమెరికా లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడింది.


1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు.


1967 : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.


1970 : చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 


2005 : దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ.


 *🌷జననాలు🌷* 


1884: విస్సా అప్పారావు, మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు.


1927: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)


1929: రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006)


1934: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)


1941: షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించాడు.


1945: లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (మ. 2020)


1952: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016) )


1956: తీజన్‌ బాయి, ప్రముఖ ఫోక్ సింగర్


1969: శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు.


1973: సచిన్ టెండుల్కర్, భారత క్రికెట్ ఆటగాడు.


 *🍁మరణాలు🍁* 


1999: ఎమ్.వి.రాజమ్మ, సినిమా నటి.


2000: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త.


2011: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926)


2015: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (జ. 1961)


 *🌼జాతీయ దినాలు🌼* 


** జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు