మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం : వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి

ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి కరోనా
విజయవాడ : వైద్యులు, పారా మెడికల్, రెవిన్యూ, పోలీస్ సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఫ్రంట్ లైనులో ఉన్న వారికి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 6306 శాంపిళ్లు పరిశీలించాము. 62 శాంపిళ్లు పాజిటివ్ వచ్చాయి. మొత్తం 54341 శాంపిళ్లను పరీక్షించాం. ప్రతి మిలియన్‌కు 1018 మందికి పరీక్షలు చేస్తున్నాం. ఆరేడు జిల్లాల్లో స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువగానే పరీక్షలు చేశాం. 46 కేసులు ప్రస్తుతమున్న కరోనా క్లస్టర్సులోనే ఉన్నాయి. 16 కేసులు ఎనిమిది కొత్త క్లస్టర్లలో వచ్చాయి. 7 మండలాల్లో కొత్తగా కేసులు నమోదయ్యాయి. 566 మండలాలు గ్రీన్ కేటగిరిలో ఉన్నాయి. ప్రస్తుతం 100 మంది పేషంట్లు డిశ్చార్జ్ కావడానికి సిద్దంగా ఉన్నారు. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం యుద్ధం చేస్తున్నాం. ర్యాలీలు చేపట్టొద్దని, సమావేశాలు పెట్టొద్దని నిబంధనలున్నాయి. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో మరణాల సంఖ్య ఎక్కువే.. మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా’’మని పేర్కొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు