మే 3 నాటికి ఏపీలో కరోనా కేసులు 2,000కి పెరిగే అవకాశం : యనమల

మే 3 నాటికి ఏపీలో కరోనా కేసులు 2,000కి పెరిగే అవకాశం : యనమల
విజయవాడ : కేంద్ర అధికారుల బృందం రాష్ట్రానికి వస్తోంది
ఆ బృందాన్ని కలుస్తాం
వైసీపీ ప్రభుత్వం కరోనాను తేలిగ్గా తీసుకుందని ఫిర్యాదు చేస్తాం
వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజు భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇలాగే కరోనా కేసులు పెరిగితే మే 3 నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,000కు చేరతాయని తెలిపారు. కేంద్ర అధికారుల బృందంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిశీలించేందుకు రెండు రోజుల్లో ఏపీకి వస్తుందని గుర్తు చేశారు.
తాము కేంద్ర అధికారుల బృందాన్ని కలుస్తామని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని వారికి ఫిర్యాదు చేస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారని తాము ఫిర్యాదు చేస్తామని అన్నారు. కరోనా కేసులు పెరిగితే ఇన్‌ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాపై సరైన లెక్కలు చెప్పాలన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020