వింజమూరులో 30 మందికి రోడ్డుపై కౌన్సిలింగ్

వింజమూరులో 30 మందికి రోడ్డుపై కౌన్సిలింగ్


వింజమూరు, ఏప్రిల్ 28 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): విచ్చలవిడిగా రోడ్లు మీదకు వస్తారా...రేపటి నుండి పనీపాటా లేకుండా రోడ్లు మీద సంచరిస్తారా...ఒకవేళ వస్తే ఏం చెయ్యమంటారు చెప్పండి అంటూ వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి ప్రశ్నిస్తుండగా రోడ్లు మీదకు రాము సార్, వస్తే శిక్షించండి అంటూ పలువురు యువకులు ప్రాదేయపడిన సంఘటన మంగళవారం నాడు వింజమూరులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గత రెండు రోజుల క్రితం వింజమూరుకు సమీపంలోని కొండాపురం మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో వింజమూరులో అధికారులు అప్రమత్తమయ్యారు. వింజమూరు పరిసర ప్రాంతాల నుండి ఏ ఒక్కరూ వింజమూరులోకి రాకూడదని ఆం క్షలు విధించారు. అలాంటి తరుణంలో వింజమూరులో విచ్చలవిడిగా తిరిగే వారికి సరైన గుణపాఠం చెప్పే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. పలువురిని ఎక్కడికక్కడ నిలిపివేసి రోడ్డుపైనే కూర్చోబెట్టారు. లాక్ డౌన్ ముగిసే వరకూ రోడ్లు మీదకు రాబోమంటూ ప్రతిజ్ఞలు చేయించారు. ఈ కార్యక్రమంలో తహసిల్ధారు సుధాకర్ రావు కూడా పాల్గొని యువకుల చేత ఇక మీదట విచ్చలవిడిగా రోడ్లు మీద తిరగబోమని ప్రమాణాలు చేయించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు