ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో 400 నాన్ ఐ సి యు బెడ్లు, 60 ఐ సి యు బెడ్లు అందుబాటు :కలెక్టర్ ఐ శామ్యూల్  ఆనంద్ కుమార్  


గుంటూరు, ఏప్రిల్ 12-2020:-  కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యక్తులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిని జిల్లా కోవిడ్  ఆసుపత్రిగా మార్చి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్  ఆనంద్ కుమార్  పేర్కొన్నారు. 


  ఆదివారం మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిని, కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్ తో కలసి జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్  ఆనంద్ కుమార్  పరిశీలించారు.  ఆసుపత్రిలోని కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తులకు చికిత్స కోసం  కేటాయించిన గదులను, పిపిఈ కిట్లను పరిశీలించారు.  ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం గురించి  ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మస్తాన్ సాహెబ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.  ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న వారికి కల్పిస్తున్న సౌకర్యాలను తెలియజేశారు. పాజిటివ్ వ్యక్తులు ఆసుపత్రిలో రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు వైద్య చికిత్స అందించాలని, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిని విజయవాడలోని స్టేట్ కోవిడ్ -19 ఆసుపత్రికి తరలించాలన్నారు.  ఆసుపత్రిలో వున్న వారికి డైటీషియన్ సూచనల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహరం అందివ్వాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో వున్న వసతులను పరిశీలించి వైద్య అధికారులతో చర్చించామన్నారు. ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో 400 నాన్ ఐ సి యు బెడ్లు, 60 ఐ సి యు బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  ఆసుపత్రిలో చికిత్స అందించే వారికి అవసరమైన క్వాలిటీ పిపిఈ కిట్లు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్ ఆర్ ఐ  తో పాటు, కె యం సి ఆసుపత్రి,  ఐ డి హెచ్ గుంటూరు, జిల్లా ఆసుపత్రి తెనాలి, మణిపాల్, లలితా సూపర్ స్పెషాలిటి కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించి  అవసరమైన సిబ్బందిని ఎక్విప్మెంట్ ను సిద్దంగా వుంచామన్నారు.   క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలు 5000 సింగల్ రూమ్ అటాచ్ద్ బాత్ రూమ్ తో ఏర్పాటు చేసామని, వీటిలో 1100 మంది వరకు ఉన్నారన్నారు.  కరోనా వైరస్ పై ఆందోళన చెందకుండా ప్రజల్లో భరోసా నింపేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు.  ప్రజలు ఇళ్ళలోనే వుండి సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్యపరమైన అలవాట్లు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వలన కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుండా నిరోధించవచ్చన్నారు.


  కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, స్పెషల్ కలెక్టర్ బాబురావు, ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు