ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశాం : జవహర్‌రెడ్డి

ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశాం : జవహర్‌రెడ్డి
అమరావతి : ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి 10 లక్షల జనాభాకు 961 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ టెస్టులు సరిగా చేయడం లేదనడం సరికాదన్నారు. కేసులను దాస్తున్నామనడంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. నిజంగా కేసులను దాస్తే ఆ వ్యక్తి వల్ల ఎందరో ఎఫెక్ట్‌ అవుతారని చెప్పారు. ఎవరైనా వీఐపీని గుర్తించకపోతే ఆయన సూపర్ స్ప్రెడర్‌గా మారుతాడని చెప్పారు. కర్నూలు ఆస్పత్రిని కూడా కరోనా ఆస్పత్రిగా మారుస్తున్నామని ఆయన ప్రకటించారు. 3 లక్షల పీపీఈ కిట్లు, 45లక్షల మాస్క్‌లు, 31లక్షల గ్లౌజ్‌లు ఉన్నాయని, క్వారంటైన్‌ 14 రోజులా..28 రోజులా అనేది చూడాలని అధికారులకు సూచించారు. కొన్ని కేసుల్లో 14 రోజుల్లో తర్వాత కూడా పాజిటివ్ వస్తోందని జవహర్‌రెడ్డి చెప్పారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు