జర్నలిస్ట్ లకు మంత్రి కన్న బాబు నిత్యావసర సరుకుల పంపిణీ

జర్నలిస్ట్ లకు మంత్రి కన్న బాబు నిత్యావసర సరుకుల పంపిణీ
 కాకినాడ :     ప్రస్తుత విపత్కర  పరిస్థితుల్లో నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. ప్రాణాలకు తెగించి lock down సమయంలో మీడియా చేస్తున్న కృషిని కన్నబాబు అభినందించారు. తాను ఒక జర్నలిస్ట్ గా పాత్రికేయుల కష్టనష్టాలు తనకు తెలుసునని అందుకే తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చానని కన్నబాబు తెలిపారు. తండ్రి కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా 10 లక్షల విలువైన సామగ్రి ని  సుమారు 400మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, కాయగూరలు, పండ్లను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు జర్నలిస్టులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశానని
ఆయన తెలియజేశారు. ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించిన మంత్రి కన్నబాబు కు పాత్రికేయులు అందరూ ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ నగర. కాకినాడ రూరల్, కరప మండలం చెందిన పాత్రికేయులు అంతా హాజరై మంత్రి కన్నబాబు అందజేసిన సహాయాన్ని ఆనందంతో స్వీకరించారు. ఈ కష్ట సమయంలో  తమను ఆదుకున్న కన్నబాబు కు తమ కుటుంబం అంతా రుణపడి ఉంటామని జర్నలిస్టులు తెలియజేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు