శ్రీకాళహస్తి ఘటనతో జిల్లాలో అప్రమత్తం అవసరం


శ్రీకాళహస్తి ఘటనతో జిల్లాలో అప్రమత్తం అవసరం


ఈనెల 20 నుండి కేంద్ర, రాష్ట్ర, జిల్లా సూచనలు తప్పనిసరి అమలు కావాలి  – పరిశీలకులు సిసోడియా 


తిరుపతి, ఏప్రిల్ 19: శ్రీకాళహస్తి ఘటనతో అప్రమత్తం అవసరం, ఈ నెల 20 నుండి కొన్ని లాక్ డౌన్ రిలాక్సేషన్స్ కేంద్ర, రాష్ట్ర, జిల్లా సూచనలు తప్పనిసరి అమలు కావాలని కోవిడ్ 19 పరిశీలకులు సీనియర్ ఐ ఏ ఎస్ ఆర్.పి.సిసోడియా ఆదేశించించారు. ఆదివారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిశీలకులు జిల్లా అధికారులతో కోవిడ్ టాక్స్ ఫోర్స్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పరిశీలకులు వివరిస్తూ శ్రీకాళహస్తి ఘటన చూస్తే అన్ని ఏర్పాట్లు చేస్తున్నా , ఎలా వచ్చిందనే సమస్య ఎదురైంది, అందులో విధుల్లో వున్న సిబ్బందికి, అధికారులకు పాజిటివ్  రావడం దురదృష్టకరం ఇకపై ప్రతి అధికారి కోవిడ్ విధుల్లో వున్నవారు తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రజలు అర్థంచేసుకోవాలి అగ్రరాజ్యం అమెరికాలో నేడు ఒక్కరోజు 4500 చనిపోయారంటే ఎలా వుంటుందో వూహించని విధంగా వుంది అన్నారు. సామాజిక దూరం తప్పని సారి పాటించాలి ,అత్వసరపరిస్థిలలో, మెడికల్ సంబందం తప్ప ఒక మండలం నుండి మరొక మండలం గానీ , జిల్లా గానీ రాష్ట్రం గానీ దాటడానికి వీలులేదు. రెడ్ జోన్ మండలాల్లో పరిశ్రమలు , ఏ ఇతర షాపులు తెరుచుకోరాదు. టాక్సీలు, స్కూలు బస్సులు , ఆటోలు తిరగడానికి వీలుండదు, బ్యాంక్స్ కార్యకలాపాలు , కిరాణా షాపులు , నిత్యవసర వ్స్తువులు , మెడికల్ దుకాణాలు వద్ద తప్పనిసరి సానిటైజర్ తో చేతులు శుబ్రపరచుకున్న తరువాత కొనుగోలుకు అనుమతి వుండాలి,  హోటల్స్, డాబాలు పనిచేయయ్నున్నాయి , హోటల్స్ లో ఎవరైనా బస చేస్తే వారి పూర్తి వివరాలు , ఎందుకు వచ్చారో తెలపాలి ఆ జాబితా రెవెన్యూ డివిజనల్ అధికారులు, సబ్ కలెక్టర్లు మానిటర్  చేయాల్సి వుంటుంది. పరిశ్రమలలో పనిచేయదలచుకున్న వారు ఆయా మండలంలో వున్నవారికే అనుమతి,  ప్రక్క మండలం వారికి కూడా అనుమతి లేదు. ప్రభుత్వ సిబ్బంది కూడా నివాస మండలం దాటి వెళ్లకూడదు.  పరిశ్రమల వారు బస్సులు నడిపితే అందులో 30 శాతం మాత్రమే ప్రయాణించాలి. రెడ్ జోన్ లో వారు బయటకు రాకూడదు. చాలామంది వాకింగ్ చేస్తున్నారు లాక్ డౌన్ వరకు అనుమతి లేదు. ఎన్ సి సి , ఎన్ జి ఓ వ్యవస్థ సేవలు వుపయోగించండి. మతపరమైన  పార్థనలు ఇంటివద్దే జరుపుకోవాలి, రానున్న 24 నుండి నుండి రంజాన్ మాసం లో అందరూ  ఇంటికే పరిమితం కావాలి. ఈ సమయంలో మటన్ , చికెన్ షాపులు అభ్యర్థన వస్తే పశు సంవర్థక శాఖ పుడ్ ఇన్సిపెక్టర్లు పర్వవేక్షణలో  అధికారుల పర్యవేక్షలో జరిగాలని ఆదేశించారు. రిలీఫ్ సెంటర్లో వున్న బయటి వ్యక్తులకు వసతులు లాక్ డౌన్ వరకు కల్పించాలి బయట వెళ్లడానికి వీలుండదు అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ గిరిషా, జెసి మార్కండేయులు, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి , జెసి 2 చంద్రమౌళి , అడిషనల్ ఎస్.పి. సుప్రజ , విమానాశ్రయ ఎపిడి సురేష్, రుయా సూపర్నెట్ ఎన్ వి రమణయ్య, నోడల్ అధికారి చంద్రశేఖర్ , పిడి లు మురళి, జ్యోతి , జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
-- డిి


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు