550 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, మామిడికాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

        ఉయ్యురు, ఏప్రిల్, 19 (అంతిమ తీర్పు) :    కరోనా వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇలాంటి సమయంలోనే అండగా ఉందాం. ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్


     శనివారం   ఉయ్యురు నగర పంచాయతి 20 వార్డు లో  తెలుగుదేశం పార్టీ నాయకులు పాండ్రాజు చిరంజీవి ఆధ్వర్యంలో సుధారాణి పర్యవేక్షణలో 550 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు, మామిడికాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్


ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని మనమందరం లాక్ డౌన్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని అలాగే జీవన ఉపాధి లేక ఇల్లు గడవని పేదకుటుంబాలకు ఇలాంటి కష్ట సమయంలోనే మనం కలిసి కట్టుగా ఆదుకోవాలని దానిలో భాగంగానే ఈ రోజు 20 వార్డులో  చిరంజీవి ప్రతి ఇంటికి కూరగాయలు, మామిడికాయలు పంచడం అభినందనీయం అని రాజేంద్ర ప్రసాద్  అన్నారు. 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, కూనపరెడ్డి వాసు, తోట శ్రీను,lp రఫీ, నడిమింటి పైడయ్య, బూరెల నరేష్, గోరెంట్ల నరేంద్ర, పెన్నేరు సాంబయ్య మరియు చిరంజీవి ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు