*14–04–2020*
*అమరావతి
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్
అమరావతి: ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు):
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్ పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు.
*ఎక్కడా రద్దీ లేకుండా, జనం గుమిగూడకుండా చర్యలు*
రద్దీని తగ్గించాలంటే.. ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి:
జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చు. లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్డౌన్ ఉద్దేశాలు నెరవేరవు:
జనం గుమిగూడకుండా ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలి:
మనం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ, మార్కెట్లను, బజార్లను వికేంద్రీకరిస్తూ, ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరాచేయండి:
ప్రజల మూవ్మెంట్ను తగ్గిస్తూ.. వారికి అందుబాటులో అన్నీ ఉండేలా చేయాలి:
అలాగే హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచింది:
హాట్స్పాట్లలో ప్రజల మూవ్ మెంట్ తగ్గించేలా, ప్రతిరోజూ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేలా, ప్రజలకు అత్యంత సమీపంలో నిత్యావసరాలు ఉండేలా చూడండి:
వీలైతే డోర్ డెలివరీ లాంటి మార్గాలపై ఆలోచన చేయండి:
*క్వారంటైన్లో ఉన్న వారికి మంచి సదుపాయాలు*
పాజిటివ్ కేసులకు సంబంధించి నెగెటివ్గా తేలిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ క్వారంటైన్లో ఉన్నారు:
వీరి విషయంలో నిర్దేశించుకున్న వైద్యవిధాన ప్రక్రియను పూర్తిచేసి, ఇళ్లకు పంపించేటప్పుడు పూర్తి ప్రోటోకాల్ పాటించాలి:
ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నెగెటివ్ వస్తే వారిని ఇళ్లకు పంపించాలి:
ఇళ్లకు వెళ్లిన తర్వాత వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి:
ఇలా ఇళ్లకు వెళ్లిన వారికి పౌష్టిక ఆహారం తీసుకునేలా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి:
మంచి పౌష్టికాహారం కోసం వారికి ఆర్థిక సహాయం కూడా చేయండి:
అలాగే క్వారంటైన్ సెంటర్లలో మంచి సదుపాయాలను పెట్టగలిగితే.. ప్రజలెవ్వరూ కూడా ఇంటికి వెళ్లిపోవాలన్న ఆలోచన చేయరు:
బాత్రూమ్స్, బెడ్లు, దుప్పట్లు, మంచి భోజనం.. ఇవన్నీకూడా చేయగలిగితే.. ఇంటికన్నా క్వారంటైనే మంచిదన్న ఆలోచన వారికి వస్తుంది:
క్వారంటైన్ సెంటర్లలో నాణ్యతమైన సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉండాలి:
అలాగే జిల్లాల్లో ఉన్న షెల్టర్లు జోన్ల అన్నింటికీ కూడా ఒక రెసిడెంట్ ఆఫీసర్ను పెట్టాలి:
ప్రతిరోజూ కూడా భోజనం, మెనూ మార్చారా? లేదా? బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? పారిశుద్ధ్యం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలి:
*పేషెంట్ కేర్ మేనేజ్ మెంట్ చాలా ముఖ్యం*
కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, సహా బీపీ, సుగర్, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు చేయించాలి:
మెడికల్ ఆఫీసర్ నిర్ధారించిన వారే కాకుండా, అందరికీ పరీక్షలు చేయించాలి:
ఒకవేళ కరోనా సోకితే.. .ఈ హైరిస్క్ ఉన్న వారిపై ప్రభావం చూపుతుంది కాబట్టి అందరికీ పరీక్షలు చేయించాలి:
కరోనా ఎవరికి వచ్చింది? వారి వయస్సు ఎంత? వారు ఇప్పటికే ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? అన్నదాన్ని గుర్తించి.. వెంటనే వారికి అత్యుత్తమ వైద్యం అందించాలి:
హైరిస్కుగా ఉన్న కేసులను గుర్తించి వారిని పూర్తిస్థాయిలో ఉత్తమ వైద్యం అందించాలి:
వారిని వెంటనే కోవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం ఇస్తే... మరణాలను అరికట్టగలం:
*ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్ సదుపాయం ఉండాలి*
ఎవరైనా పేషెంట్ వస్తే... అతనికి కరోనా ఉందా? లేదా? అన్నది ఎవ్వరికీ తెలియదు:
అలాంటి పరిస్థితుల్లో పేషెంట్ను తిరిగి పంపే ప్రసక్తి ఉండకూడదు:
వచ్చే ప్రతి పేషెంట్ను కోవిడ్ కేసే అనుకుని ఆమేరకు వైద్యులు, సిబ్బంది, జాగ్రత్తలు తీసుకుని... వైద్యం అందించాలి:
తర్వాత కోవిడ్ పరీక్షలు చేస్తే.. నెగెటివ్గా వస్తే.. చికిత్సను అక్కడే అందించడానికి వీలుంటుంది:
అలాగే పాజిటివ్ వస్తే.. కోవిడ్ ఆస్పత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది:
అలాగే కోవిడ్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కూడా బాగా డెవలప్ చేయాలి:
వైద్యులకు, సిబ్బందికి మాస్క్లు, పీపీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలి:
*ఏప్రిల్ 16 నుంచి రేషన్ పంపిణీ సందర్భంగా చర్యలు*
*ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు*
రేషన్ దుకాణాల కౌంటర్లను పెంచుతున్నాం: సీఎం
ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం:
అంతేకాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నాం:
ఎవరు ఏ రోజు రేషన్కోసం రావాలో, ఏ కౌంటర్ వద్దకు రావాలో స్లిప్పులో పేర్కొన్నాం:
కౌంటర్ వద్ద కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు:
గత రేషన్ సమయంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఈసారి మరింత జాగ్రత్తగా చర్యలు::
ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టాం:
అర్హత ఉంటే.. ఎలా దరఖాచేయాలో పెట్టాం:
వచ్చే వారం పదిరోజుల్లో వారి దరఖాస్తులు పరిశీలనచేసి కార్డులు మంజూరుచేయండి:
ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ:
ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదు కాబట్టి.. ఎవరు రేషన్ అడిగినా ఇవ్వండి:
ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు:
గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000లు ఇవ్వండి:
ఇన్స్పెక్షన్ లాంటి అంశాలకు ఇప్పుడు జోలికిపోవద్దు.. తర్వాత పరిశీలన చేసుకోవచ్చు:
పాత రేషన్ కార్డు ఉన్నా, బియ్యం తీసుకున్నా... సరే.. వెంటనే వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రూ.1000లు ఇవ్వండి:
ఎవ్వరూ కూడా పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు:
*ధాన్యం కొనుగోళ్లుపై...*
ధాన్యం కొనుగోళ్లు గ్రామస్థాయిలో చేస్తున్నాం:
అగ్రికల్చర్ అసిస్టెంట్కు బాధ్యతలు అప్పగించాం:
మొదటిసారి ఫాంగేట్ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం:
తెలంగాణనుంచి ధాన్యంకూడా రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం:
మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం:
సరిహద్దులనుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నా:
కొనుగోళ్లు సవ్యంగా çజరుగుతున్నాయా? లేవా? అన్నది చూసుకోండి:
ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి:
వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాం:
*వ్యవసాయంపై...*
మార్కెటింగ్కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం:
ఈ సమయంలో వ్యవసాయం అన్నదాన్ని మనం కాపాడుకోగలిగితే, రైతు అనేవాడిని మనం ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం:
వ్యవసాయం అన్నది పూర్తిగా ధ్యాసపెట్టాల్సిన అంశం:
గ్రామ స్థాయినుంచి మార్కెట్ ఇంటెలిజెన్స్ రావాలి:
గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆసమాచారం రావాలి:
అగ్రికల్చర్ అసిస్టెంట్ తనకు ఇచ్చిన ట్యాబ్ ద్వారా ఈసమాచారాన్ని నివేదించాలి:
ఈ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి:
రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్నదానిపై కలెక్టర్లకు సమాచారం రావాలి:
దీని ఆధారంగా మార్కెటింగ్శాఖ అధికారులతో మాట్లాడాలి:
మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి:
కాని కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదు:
రవాణాకూడా జరగడంలేదు:
మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదు:
ఈ సమస్యలపైన రోజూ ఉన్నతాధికారులు దృష్టిపెడుతున్నారు:
కలెక్టర్లుకూడా ఈసమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టాలి:
మార్కెటింగ్ అధికారులతో మాట్లాడాలి:
రవాణాకూడా అందుబాటులోకి తీసుకురావాలి:
బయట మార్కెట్లకు పంపించడమే కాదు, స్థానిక మార్కెట్లపైన కూడా దృష్టిపెట్టాలి:
స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల, వార్డులు స్థాయి, గ్రామస్థాయిల వరకూ అరటిని పంపుతున్నాం:
మనకు వచ్చే రేటుకే ప్రజలకు అమ్ముతున్నాం:
రైతుకు మంచి జరిగితే చాలు అని అనుకుంటున్నాం:
చివరకు ఈ ఆలోచన వెయస్సార్ జనతా బజార్లకు దారితీస్తుంది:
వచ్చే ఏడాదిలోగా ఈ బజార్లకు రూపకల్పన చేస్తున్నాం:
కరోనా విపత్తు కారణంగా మనం తీసుకునే చర్యల రూపంలో వైయస్సార్ జనతాబజార్లకు బీజం వేస్తున్నాం:
ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్నా.. మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:
రెండోవైపున రైతులు అవస్తలు పడకుండా చర్యలు తీసుకోవాలి:
భౌతిక దూరం పాటించేలా వారిలో చైతన్యంకలిగించి... ఆమేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి:
కరోనా నివారణా చర్యలు పాటిస్తూ.. కార్యకలాపాలు ఎలా చేపట్టాలన్నదానిపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించాలి:
*ఆక్వా ఉత్పత్తులపై...*
అలాగే ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి కూడా గడచిన కొన్ని రోజులు గట్టి చర్యలు తీసుకున్నాం:
ఆయా ప్రాంతాల్లో ఉన్న కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి:
ఆక్వా రైతులకు మేలు చేయాలి:
ప్రాససింగ్ ప్లాంట్లు పనిచేసేలా, ఎగుమతులు జరిగేలా చూడాలి:
ఎంపెడా నిర్దేశించిన రేట్లకు కొనుగోలు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి:
అలాగే చేపల దాణా రేట్లను విపరీతంగా పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో... వాటి రేట్లు కూడా పెరగకుండా చర్యలు తీసుకోవాలి:
ఇంతకుముందు ఏ రేట్లు అయితే ఉన్నాయో.. అవే రేట్లకు అమ్మాలి:
కలెక్టర్లు దీనిపై పర్యవేక్షణ చేయాలి:
సీడు, ఫీడ్పై ఆర్డినెన్స్ను తీసుకు రావాలని సీఎం ఆదేశం
పూర్తి బాధ్యత తీసుకోవాలి:
అప్పుడే ఆక్వా రంగంలో స్థిరీకరణ ఉంటుంది:
ఆక్వా అసిస్టెంట్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోండి:
గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి
నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉంది
మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది
రైతు భరోసాకేంద్రాలు, విలేజ్ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
ఆర్బీకేలు జూన్ నుంచి పనిచేయాలి, 2021 మార్చి నాటికి ఇవి పూర్తికావాలి
*నిత్యావసర వస్తువు ధరలపై నియంత్రణ*
నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి: సీఎం
ప్రతి దుకాణం వద్ద ప్రకటించిన ధరలను బోర్డుల్లో ప్రదర్శించాలి
ఇది చేయకపోతే.. కలెక్టర్లదే తప్పు అవుతుంది
రెండు రోజులకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలను ప్రకటించాలి, ప్రచారం చేయాలి
ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైల్లో పెట్టాలి
కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి
నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా కంట్రోల్లో ఉండాలి
*మే 15 కల్లా రైతు భరోసాకు సిద్ధం కావాలి*
ఎవరైనా మిగిలిపోతే.. వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై ప్రొసీజర్ను మళ్లీ గ్రామ సచివాలయాలకు పంపండి...
అర్హతలను, ఎవరెవరికి దరఖాస్తుచేయాలో సమాచారాన్ని అందుబాటులో ఉంచండి
ఇళ్లపట్టాలకోసం తీసుకున్న ప్రతి ఎకరా కూడా కన్సెంట్తోనే, వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతనే తీసుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా
పొజిషన్లోకి తీసుకోవాల్సిన భూమిని వెంటనే ధ్యాసపెట్టి కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మేలో దీనికి సంబంధించి పంపిణీకి చర్యలు తీసుకుందాం...
లే అవుట్ డెవలప్మెంట్.. సహా చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తిచేయాలి
*తల్లుల అక్కౌంట్లోకే ఫీజు రియంబర్స్ మెంట్*
2018–19 సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు
చెల్లించడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి 3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రియింబర్స్మెంట్కూడా చెల్లించాం:సీఎం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి అక్కౌంట్కే ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తాం:సీఎం
ప్రతి త్రైమాసికం పూరై్తన తర్వాత నేరుగా తల్లి అక్కౌంట్లోకే జమ:సీఎం
గతంలో ఇంజినీరింగ్కు ఫీజు రియింబర్స్ మెంట్కింద ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదన్న అధికారులు
ఇది పోను మిగిలిన డబ్బును కాలేజీలు తల్లిదండ్రులనుంచి వసూలు చేశాయన్న అధికారులు
కాని, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్ కిందకాలేజీలకు ఇచ్చిందన్న అధికారులు
తల్లిదండ్రులనుంచి అదనంగా వసూలుచేసిన ఈ డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న అధికారులు
దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు
లేకపోతే... కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టీకరణ: