కలెక్టర్లు,  ఎస్పీలతో సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్

*14–04–2020*
*అమరావతి


కలెక్టర్లు,  ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్


అమరావతి:  ఏప్రిల్ 14,(అంతిమ తీర్పు):
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
కోవిడ్‌నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్‌ పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు. 


*ఎక్కడా రద్దీ లేకుండా, జనం గుమిగూడకుండా చర్యలు*


రద్దీని తగ్గించాలంటే.. ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి:
జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చు. లేకపోతే రద్దీ ఉండి మళ్లీ లాక్‌డౌన్‌ ఉద్దేశాలు నెరవేరవు:
జనం గుమిగూడకుండా ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలి:
మనం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ, మార్కెట్లను, బజార్లను వికేంద్రీకరిస్తూ, ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరాచేయండి:
ప్రజల మూవ్‌మెంట్‌ను తగ్గిస్తూ.. వారికి అందుబాటులో అన్నీ ఉండేలా చేయాలి:
అలాగే హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోండెలివరీ లాంటి మార్గాలను ఎంచుకంటే మంచింది:
హాట్‌స్పాట్లలో ప్రజల మూవ్‌ మెంట్‌ తగ్గించేలా, ప్రతిరోజూ నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేలా, ప్రజలకు అత్యంత సమీపంలో  నిత్యావసరాలు ఉండేలా చూడండి:
వీలైతే డోర్‌  డెలివరీ లాంటి మార్గాలపై ఆలోచన చేయండి:


*క్వారంటైన్‌లో ఉన్న వారికి మంచి సదుపాయాలు*


పాజిటివ్‌ కేసులకు సంబంధించి నెగెటివ్‌గా తేలిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ క్వారంటైన్‌లో ఉన్నారు:
వీరి విషయంలో నిర్దేశించుకున్న  వైద్యవిధాన ప్రక్రియను పూర్తిచేసి, ఇళ్లకు పంపించేటప్పుడు పూర్తి ప్రోటోకాల్‌ పాటించాలి:
ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నెగెటివ్‌ వస్తే వారిని ఇళ్లకు పంపించాలి:
ఇళ్లకు వెళ్లిన తర్వాత వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి:
ఇలా ఇళ్లకు వెళ్లిన వారికి పౌష్టిక ఆహారం తీసుకునేలా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి:
మంచి పౌష్టికాహారం కోసం వారికి ఆర్థిక సహాయం కూడా చేయండి:


అలాగే క్వారంటైన్‌ సెంటర్లలో మంచి సదుపాయాలను పెట్టగలిగితే.. ప్రజలెవ్వరూ కూడా ఇంటికి వెళ్లిపోవాలన్న ఆలోచన చేయరు:
బాత్‌రూమ్స్, బెడ్లు, దుప్పట్లు, మంచి భోజనం.. ఇవన్నీకూడా చేయగలిగితే.. ఇంటికన్నా క్వారంటైనే మంచిదన్న ఆలోచన వారికి వస్తుంది:
క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతమైన సేవలు, సదుపాయాలు అందుబాటులో ఉండాలి:
అలాగే జిల్లాల్లో ఉన్న షెల్టర్లు జోన్ల అన్నింటికీ కూడా ఒక రెసిడెంట్‌ ఆఫీసర్‌ను పెట్టాలి:
ప్రతిరోజూ కూడా భోజనం, మెనూ మార్చారా? లేదా? బాత్‌రూమ్స్‌ పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? పారిశుద్ధ్యం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకోవాలి:


*పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌ మెంట్‌ చాలా ముఖ్యం*


కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, సహా బీపీ, సుగర్, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు చేయించాలి:
మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారే కాకుండా, అందరికీ పరీక్షలు చేయించాలి:
ఒకవేళ కరోనా సోకితే.. .ఈ హైరిస్క్‌ ఉన్న వారిపై ప్రభావం చూపుతుంది కాబట్టి అందరికీ పరీక్షలు చేయించాలి:


కరోనా ఎవరికి వచ్చింది? వారి వయస్సు ఎంత? వారు ఇప్పటికే ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? అన్నదాన్ని గుర్తించి.. వెంటనే వారికి అత్యుత్తమ వైద్యం అందించాలి:
హైరిస్కుగా ఉన్న కేసులను గుర్తించి వారిని పూర్తిస్థాయిలో ఉత్తమ వైద్యం అందించాలి:
వారిని వెంటనే కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులకు తరలించి మంచి వైద్యం ఇస్తే... మరణాలను అరికట్టగలం:


*ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ సదుపాయం ఉండాలి*
ఎవరైనా పేషెంట్‌ వస్తే... అతనికి కరోనా ఉందా? లేదా? అన్నది ఎవ్వరికీ తెలియదు:
అలాంటి పరిస్థితుల్లో పేషెంట్‌ను తిరిగి పంపే ప్రసక్తి ఉండకూడదు:
వచ్చే ప్రతి పేషెంట్‌ను కోవిడ్‌ కేసే అనుకుని ఆమేరకు వైద్యులు, సిబ్బంది, జాగ్రత్తలు తీసుకుని... వైద్యం అందించాలి:
తర్వాత కోవిడ్‌ పరీక్షలు చేస్తే.. నెగెటివ్‌గా వస్తే.. చికిత్సను అక్కడే అందించడానికి వీలుంటుంది:
అలాగే పాజిటివ్‌ వస్తే.. కోవిడ్‌ ఆస్పత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది:
అలాగే కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కూడా బాగా డెవలప్‌ చేయాలి:
వైద్యులకు, సిబ్బందికి మాస్క్‌లు, పీపీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలి:


*ఏప్రిల్‌ 16 నుంచి రేషన్‌ పంపిణీ సందర్భంగా చర్యలు*
*ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు*


రేషన్‌ దుకాణాల కౌంటర్లను పెంచుతున్నాం: సీఎం
ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం:
అంతేకాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నాం:
ఎవరు ఏ రోజు రేషన్‌కోసం రావాలో, ఏ కౌంటర్‌ వద్దకు రావాలో స్లిప్పులో పేర్కొన్నాం:
కౌంటర్‌ వద్ద కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు:
గత రేషన్‌ సమయంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఈసారి మరింత జాగ్రత్తగా చర్యలు::
ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టాం:
అర్హత ఉంటే.. ఎలా దరఖాచేయాలో పెట్టాం:
వచ్చే వారం పదిరోజుల్లో వారి దరఖాస్తులు పరిశీలనచేసి కార్డులు మంజూరుచేయండి:
ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ:
ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదు కాబట్టి.. ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వండి:
ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు:


గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000లు ఇవ్వండి:
ఇన్‌స్పెక్షన్‌ లాంటి అంశాలకు ఇప్పుడు జోలికిపోవద్దు.. తర్వాత పరిశీలన చేసుకోవచ్చు:
పాత రేషన్‌ కార్డు ఉన్నా, బియ్యం తీసుకున్నా... సరే.. వెంటనే వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రూ.1000లు ఇవ్వండి:
ఎవ్వరూ కూడా పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు:


*ధాన్యం కొనుగోళ్లుపై...*


ధాన్యం కొనుగోళ్లు గ్రామస్థాయిలో చేస్తున్నాం:
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించాం:
మొదటిసారి ఫాంగేట్‌ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నాం:
తెలంగాణనుంచి ధాన్యంకూడా రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం:
మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం:
సరిహద్దులనుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నా:
కొనుగోళ్లు సవ్యంగా çజరుగుతున్నాయా? లేవా? అన్నది చూసుకోండి:
ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి:
వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాం:


*వ్యవసాయంపై...*


మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం:
ఈ సమయంలో వ్యవసాయం అన్నదాన్ని మనం కాపాడుకోగలిగితే, రైతు అనేవాడిని మనం ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం:
వ్యవసాయం అన్నది పూర్తిగా ధ్యాసపెట్టాల్సిన అంశం:


గ్రామ స్థాయినుంచి మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రావాలి:
గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆసమాచారం రావాలి:
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ తనకు ఇచ్చిన ట్యాబ్‌ ద్వారా ఈసమాచారాన్ని నివేదించాలి:
ఈ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి:
రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయన్నదానిపై కలెక్టర్లకు సమాచారం రావాలి:
దీని ఆధారంగా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాలి:
మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి:
కాని కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదు:
రవాణాకూడా జరగడంలేదు:
మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదు:
ఈ సమస్యలపైన రోజూ ఉన్నతాధికారులు దృష్టిపెడుతున్నారు:
కలెక్టర్లుకూడా ఈసమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టాలి:
మార్కెటింగ్‌ అధికారులతో మాట్లాడాలి:
రవాణాకూడా అందుబాటులోకి తీసుకురావాలి:
బయట మార్కెట్లకు పంపించడమే కాదు, స్థానిక మార్కెట్లపైన కూడా దృష్టిపెట్టాలి:
స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల, వార్డులు స్థాయి, గ్రామస్థాయిల వరకూ అరటిని పంపుతున్నాం:
మనకు వచ్చే రేటుకే ప్రజలకు అమ్ముతున్నాం:
రైతుకు మంచి జరిగితే చాలు అని అనుకుంటున్నాం:
చివరకు ఈ ఆలోచన వెయస్సార్‌ జనతా బజార్లకు దారితీస్తుంది:
వచ్చే ఏడాదిలోగా ఈ బజార్లకు రూపకల్పన చేస్తున్నాం:
కరోనా విపత్తు కారణంగా మనం తీసుకునే చర్యల రూపంలో వైయస్సార్‌ జనతాబజార్లకు బీజం వేస్తున్నాం:
ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్నా.. మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి:


రెండోవైపున రైతులు అవస్తలు పడకుండా చర్యలు తీసుకోవాలి:
భౌతిక దూరం పాటించేలా వారిలో చైతన్యంకలిగించి... ఆమేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి:
కరోనా నివారణా చర్యలు పాటిస్తూ.. కార్యకలాపాలు ఎలా చేపట్టాలన్నదానిపై రైతులకు అవగాహన, చైతన్యం కలిగించాలి:


*ఆక్వా ఉత్పత్తులపై...*


అలాగే ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి కూడా గడచిన కొన్ని రోజులు గట్టి చర్యలు తీసుకున్నాం:
ఆయా ప్రాంతాల్లో ఉన్న కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి:
ఆక్వా రైతులకు మేలు చేయాలి:
ప్రాససింగ్‌ ప్లాంట్లు పనిచేసేలా, ఎగుమతులు జరిగేలా చూడాలి:
ఎంపెడా నిర్దేశించిన రేట్లకు కొనుగోలు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి:
అలాగే చేపల దాణా రేట్లను విపరీతంగా పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో... వాటి రేట్లు కూడా పెరగకుండా చర్యలు తీసుకోవాలి:
ఇంతకుముందు ఏ రేట్లు అయితే ఉన్నాయో.. అవే రేట్లకు అమ్మాలి:
కలెక్టర్లు దీనిపై పర్యవేక్షణ చేయాలి:
సీడు, ఫీడ్‌పై ఆర్డినెన్స్‌ను తీసుకు రావాలని సీఎం ఆదేశం
పూర్తి బాధ్యత తీసుకోవాలి:
అప్పుడే ఆక్వా రంగంలో స్థిరీకరణ ఉంటుంది:
ఆక్వా అసిస్టెంట్‌ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోండి:


గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి
నిరంతరం ఇది జరగాల్సిన అవసరం ఉంది
మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది


రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
ఆర్బీకేలు జూన్‌ నుంచి పనిచేయాలి, 2021 మార్చి నాటికి ఇవి పూర్తికావాలి


*నిత్యావసర వస్తువు ధరలపై నియంత్రణ*


నిత్యావసర వస్తువుల ధరలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి: సీఎం
ప్రతి దుకాణం వద్ద ప్రకటించిన ధరలను బోర్డుల్లో ప్రదర్శించాలి
ఇది చేయకపోతే.. కలెక్టర్లదే తప్పు అవుతుంది
రెండు రోజులకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలను ప్రకటించాలి, ప్రచారం చేయాలి
ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైల్లో పెట్టాలి
కలెక్టర్లు,  ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి
నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా కంట్రోల్‌లో ఉండాలి


*మే 15 కల్లా రైతు భరోసాకు సిద్ధం కావాలి*
ఎవరైనా మిగిలిపోతే.. వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై ప్రొసీజర్‌ను మళ్లీ గ్రామ సచివాలయాలకు పంపండి...
అర్హతలను, ఎవరెవరికి దరఖాస్తుచేయాలో సమాచారాన్ని అందుబాటులో ఉంచండి


ఇళ్లపట్టాలకోసం తీసుకున్న ప్రతి ఎకరా కూడా కన్సెంట్‌తోనే, వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతనే తీసుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా
పొజిషన్‌లోకి తీసుకోవాల్సిన భూమిని వెంటనే ధ్యాసపెట్టి కంప్లీట్‌ చేయాల్సిందిగా కోరుతున్నాం
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మేలో దీనికి సంబంధించి పంపిణీకి చర్యలు తీసుకుందాం...
లే అవుట్‌ డెవలప్‌మెంట్‌.. సహా చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తిచేయాలి


*తల్లుల అక్కౌంట్లోకే ఫీజు రియంబర్స్‌ మెంట్‌*


2018–19 సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు
చెల్లించడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి 3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రియింబర్స్‌మెంట్‌కూడా చెల్లించాం:సీఎం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి అక్కౌంట్‌కే ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం:సీఎం
ప్రతి త్రైమాసికం పూరై్తన తర్వాత నేరుగా తల్లి అక్కౌంట్‌లోకే జమ:సీఎం


గతంలో ఇంజినీరింగ్‌కు ఫీజు రియింబర్స్‌ మెంట్‌కింద ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదన్న అధికారులు
ఇది పోను మిగిలిన డబ్బును కాలేజీలు తల్లిదండ్రులనుంచి వసూలు చేశాయన్న అధికారులు
కాని, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్‌మెంట్‌ కిందకాలేజీలకు ఇచ్చిందన్న అధికారులు
తల్లిదండ్రులనుంచి అదనంగా వసూలుచేసిన ఈ డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న అధికారులు
దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని  కలెక్టర్లకు ఆదేశాలు
లేకపోతే... కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెడతామని స్పష్టీకరణ:


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం