వలస కూలీలు హోం క్వారంటైన్ పాటించండి

వలస కూలీలు హోం క్వారంటైన్ పాటించండి
మంత్రాలయం,ఏప్రిల్, 30 (అంతిమ తీర్పు):-
గుంటూరు, చీరాల, సత్తైనపల్లి తదితర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వలస కూలీలు తప్పకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించాలని వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి కోరారు. గురువారం ఉదయం మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోణ గ్రామ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఇతర ప్రాంతాల నుంచి 10 బస్సులో వచ్చిన దాదాపు 300 మంది వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి వలస కూలీలకు టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులు , పారిశుధ్య కార్మికుల పని తీరు చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి కరోనా వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాంపురం, కాచాపురం, రచ్చమర్రి, ఆకుల బిచ్చాల, గుండ్రేవుల తదితర గ్రామాలకు చెందిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో సోంత గ్రామాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాధ, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, వైద్యాధికారి సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు