రాష్ట్రవ్యాప్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్లు, 1చోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడి

*30–04–2020*
*అమరావతి*


*మత్స్యకారులకి మహర్ధశ


 *రాష్ట్రవ్యాప్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్లు, 1చోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం*


*అమరావతి:*


*మత్స్యకారులకి మహర్ధశ*


*9 చోట్ల చేపలవేటకు చక్కటి మౌలిక సదుపాయాలు*


*రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లు, ఒక చోట ఫిష్‌ ల్యాండ్‌ నిర్మించనున్న ప్రభుత్వం*


*దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం*


*రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


క్యాంపు కార్యాలయలంలో సమీక్షించిన ముఖ్యమంత్రి, 
మంత్రి మోపిదేవి సహా ఇతర అధికారులు హాజరు


శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నంలో 1, తూ.గో.లో 1, ప.గో.లో 1, కృష్ణాజిల్లాలో 1, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరులో 1 చొప్పున నిర్మాణం


శ్రీకాకుళం జిల్లాలో బడగట్లపాలెం– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,  
శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో– ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం. 


విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,


తూ.గో.జిల్లా ఉప్పాడలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్


ప.గో.జిల్లా నర్సాపురంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్


కృష్ణాజిల్లా మచిలీపట్నంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,


గుంటూరుజిల్లా నిజాంపట్నంలో– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,


ప్రకాశం జిల్లా  కొత్తపట్నంలో– మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌


నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌లను నిర్మించనున్న ప్రభుత్వం. 


రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోకూడదు: సీఎం


రెండున్నర మూడు సంవత్సరాల వ్యవధిలో వీటిని పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం


గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ ఫెసిలిటీస్‌ మాత్రమే ఇచ్చారు: మంత్రి మోపిదేవి వెంకట రమణ


గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు: మోపిదేవి వెంకటరమణ


ఇప్పుడు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ కట్టబోతున్నాం: మంత్రి మోపిదేవి వెంకటరమణ


ముఖ్యమంత్రిగా మీరు కల్పిస్తున్న అవకాశాలు మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులను తీసుకు వస్తాయి:


చేపలవేట పెరగడమే కాదు, వారికి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడుతుంది:


ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న కార్యక్రమాలను మత్స్య కారులు ఎవ్వరూ మరిచిపోలేరు : మంత్రి
 మోపిదేవి వెంకటరమణ


సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు