బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు

🌷అంబెడ్కర్ జయంతి శుభాకాంక్షలు🌷
 ✊️డా: భీమ్ రావ్ రాంజీ అంబెడ్కర్✊️ 

బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు 
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ జీవనం:
తల్లిదండ్రులు:-
తల్లీ భీమాభాయ్ సక్పాల్ 
తండ్రి రాంజీ మాళోజి సక్పాల్ (బ్రిటిష్ ఆర్మీ సుభేధారి )
👉గ్రామం:అంబవాడ గ్రామం 
జిల్లా: రత్నగిరి, మహారాష్ట్ర. 
జననం:14-ఏప్రిల్ -1891
👉వివాహం: 
రమాబాయి అంబెడ్కర్ 1906 లో వివాహం జరిగింది. (1935 లో రక్త హీనతతో రమాబాయి చనిపోయారు)
సవిత అంబెడ్కర్:(శారద కబీర్)
1948-ఏప్రిల్ -15 న వివాహం చేసుకున్నారు. 
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ మరణం:
రాజకీయ పరిస్థితులపై తన అనుచరులు అనుకున్న వారి వ్యవహారి సైలి వలన, తీవ్ర వత్తిడి వలన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు. 
👉బాబా సాహెబ్ తొమ్మిది భాషల్లో పూర్తి ప్రావీణ్యం కలిగి ఉన్నారు 
మరాఠి, హిందీ, ఇంగ్లీష్, గుజరాతి, పాళీ సంస్కృతం, జర్మన్, పార్శి, ఫ్రెంచ్.. 
👉అంబెడ్కర్ ఒక విశ్వ మానవుడు 
👉ఆయన చదువు నాడు దేశ చరిత్రలో ఒక సంచలనం 
👉ఆయన పడ్డ అవమానాలు అనిర్వచనీయం 
👉ఆయన జ్ఞానం అసమాన్యం 
👉ఆయన ముందు చూపు,ఆలోచన జాతికి మేలుకొలుపు. 
👉అంతటి గొప్పవ్యక్తికి మన దేశ సమాజంలో ప్రతీ మూల మూలల నుండి విచక్షణను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.. !!
ధైర్యంగా ఎదుర్కొని చివరకు జాతికి తన జీవితం ఒక ఉదాహరణగా చాటి చెప్పిన మహనీయుడు.
✍️B.R.AMBEDKAR గారి గురించి క్లుప్తంగా:
అంబెడ్కర్ గారి అసలు పేరు నిజానికి అంబవాడేకర్ గా రికార్డ్స్ లో ఉండేది.. !!
ఆయన "మహర్"  అనే తక్కువ (దళితులలో)పుట్టారు.. !!
కానీ ఆయన గురువు మహాదేవ్ అంబెడ్కర్ (బ్రాహ్మణుడు)అంబెడ్కర్ గారికి చదువు పై ఉన్న ఆసక్తిని గమనించి, అంబెడ్కర్ గారు గొప్పవారు అవుతారు అని ముందే గమనించి, ఆయన ఎదుగుదలకి తప్పకుండా కులం అడ్డు వస్తుందని ఆలోచించి పాఠశాల రికార్డులో "అంబేవాడేకర్" నుండి 
గురువుగారు (బ్రాహ్మణ ) ఇంటిపేరు ఐన "అంబెడ్కర్"ని ఆయనకు పెట్టారు 
ఇది ఆయన పేరు వెనుక ఉన్నా అసలు చరిత్ర.. !
👉నాకు ఆయన గురించి ఎప్పటికీ అర్ధం కాని విషయం ఒకటుంది ఆయన్ని తన దేశం ఇంతగా అసహ్యించుకున్నా, ద్వేషించినా ఆయన ఎప్పుడూ తన దేశ ప్రజల మీద అసహ్యం,  కోపం,  పగ పెంచుకోలేదు.. !!
ఎందుకో మరి 
వేరే వాళ్ళు ఐతే దేశం వదిలి తప్పకుండా వెళ్ళిపోయేవారేమో. 
✍️Dr.B.R అంబేద్కర్ గారి చదువులు📖📖
👉 మెట్రికులేషన్ -1908 
👉 B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
👉M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
👉Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
👉D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
 M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
👉Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
👉 Political Economics - Germany. 
👉LLD - (Honoris) Columbia University, New York, For his achievements. 
✍️ఆయన జీవితం లో ఎదుర్కొన్న అంటరానితనానికి ఉదాహరణలు 
👉చిన్నతనంలో school లో తన తోటి విద్యార్థులు ఆయన అంటరానివాడు అని క్లాస్ నుండి గెంటేఇస్తే కిటికీలో నుంచి చూసి చదువుకున్న మేధావి.. !!
👉అదేంటో ఆయన పోరాడింది బీదలకోసం, బడుగు బలహీన వర్గాల కోసం.. అంటే SC, ST, BC, ల కోసం 
అలా అని ఆయన అగ్రవర్ణాల మీద ఇసుమంత ద్వేషం కూడా పెంచుకోలేదు. వారు కూడా బాగుండాలని కోరుకున్నారు. 
👉కరెక్ట్ గా చెప్పాలంటే జాతి మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకున్నారు..!!
కానీ చాలా విచిత్రం ఆయన కేవలం దళితుల ఆస్తిగా  వారికి మాత్రమే ఆశాకిరణంగా మారిపోయి ఆయన్ని కొందరు బాదించారు అది చాలా బాధాకరం.
👉ఆయన అందరి ఆస్తి 
ఇంకా చెప్పాలంటే ఆయన జాతి ఆస్తి.. !!
అంబెడ్కర్ ఈ భారత జాతి ముద్దుబిడ్డ..!!
ఈ దేశ ప్రజలందరికి అంబెడ్కర్ ఆలోచనతో నడిచే ప్రతీ భారతీయ పౌరునికి అంబెడ్కర్ పై హక్కుంది.. !!
అంబెడ్కర్ గారు ఒక్క దళితుల కోసమే పోరాడలేదు.
✍️ఆయన సాధించిన విజయాలలో కొన్ని :
👉పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కు కల్పించిన మహిళా పక్షపాతి. 
👉కార్మికులకు, ఉద్యోగులకు 8 గంటల పని హక్కు కల్పించిన కార్మిక పక్షపాతి. 
👉భారతీయులందరికి 18 సంవత్సరాల వయస్సుకే ఓటు హక్కును కల్పించారు 
👉బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 5 సంవత్సరాలనుండి 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఉచిత విద్యా హక్కు కల్పించిన చిన్నారుల ఆనిముత్యం. 
👉బానిస బ్రతుకులు బ్రతుకుతున్న అంటరానివాళ్ళ విముక్తి కోసం SC, ST, BC లకు రిజర్వేషన్స్ కల్పించిన ఆరాద్యుడు అంబెడ్కర్..
👉దేశంలో రిజర్వు బ్యాంకు ద్వారా ప్రతీ ఒక్క భారతీయుడికి ఆర్థిక హక్కులతో పాటు ఇంకా ఎన్నో హక్కులను ప్రసాదించిన మహనీయుడు అంబెడ్కర్.. 
👉అన్నిటికంటే గొప్ప సంగతి దేశం గర్వపడే విషయం అంబెడ్కర్ భారతీయులందరికీ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహాజ్ఞాని.. 
✍️అంబెడ్కర్ అనే వ్యక్తి:
👉ఒక గొప్ప కాన్స్టిట్యూషనలిస్ట్ 
👉ఒక విప్లవకారుడు 
👉ఒక గొప్ప పార్లమెంటేరియన్ 
👉ఒక గొప్ప ఎకనామిస్ట్ 
👉ఒక గొప్ప సామాజిక వేత్త 
👉ఒక గొప్ప రాజకీయ వేత్త 
👉ఒక గొప్ప ఇండియన్ జ్యూరిస్ట్ 
👉ఒక గొప్ప బౌద్ధ కార్యకర్త
👉ఒక గొప్ప ఫిలాసఫర్ 
👉ఒక గొప్ప ఆలోచనకర్త 
👉 ఒక గొప్ప ఆంథ్రోపోలోజిస్ట్ 
👉ఒక గొప్ప చరిత్ర కారుడు 
👉ఒక గొప్ప ప్రసంగీకుడు 
👉ఒక గొప్ప సాంఘీక సంస్కర్త 
✍️ఆయన ద్వారా జరిగిన కొన్ని మేలులు:
👉మహిళా కార్మికులకు సంక్షేమనిధి 
👉ESI
👉ప్రావిడెంట్ ఫండ్ చట్టం 
👉మహిళా శిశు కార్మికుల రక్షణ చట్టం 
👉మహిళలు కార్మిక బిల్లు 
👉ప్రసూతి ప్రయోజనం 
👉విడాకులు చట్టం 
👉ఆస్తి హక్కు 
👉కార్మికులకు సెలవు ప్రయోజనాలు 
👉revision of scale of pay for employees.. 
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో 
కానీ.. !
ఇంత గొప్ప మేధావిని కేవలం తక్కువ కులం అనే కారణంతో తిరస్కరించబడ్డారు.. !!
ఈ మేధావిని ప్రపంచం మొత్తం గుర్తించింది... ఒక్క మనదేశ మెజారిటీ ప్రజలు తప్ప.. !!
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ:
నా జీవితాన్ని, నా కుటుంబాన్ని త్యాగం చేసిన ఫలితంగా మీకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు, ఎన్నో హక్కులు, ఎన్నో చట్టాలు అందించాను. 
మన సమాజంలో కొంతపురోగతి కనిపిస్తుంది. 
విద్యా వంతులైన కొందరు ఉన్నత స్థాయికి చేరారు. 
చదువు పూర్తి ఐనాకా వారు సమాజానికి సేవ చేస్తారని ఆశించాను. కానీ వారు నన్ను మోసగించారు. విద్యాబ్యాసంతో చిన్న, పెద్ద గుమస్తాల గుంపులు బయలుదేరి, తమ పొట్టల్ని నింపుకోవడం మాత్రమే కన్పిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు తమ జీవితంలో 20% తమ జాతి కోసం ఉద్యమ విరాళంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సమాజం పురోగమిస్తుంది, లేకపోతే ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. 
చదువుకున్న వారిపై గ్రామాలలో ఉన్నవారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.విద్యావంతుడైన సామాజిక కార్యకర్త లభించడం వారికి ఒక వరం లాంటిది అని ఆయన ఎంతో మనోవ్యధతో అన్నారు.
1956 లో అంబెడ్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నాటికంటే ఈ రోజు ఉద్యోగులు సంఖ్య ఎన్నో రెట్లు అధికమైంది. కానీ వారిలో తమ జాతి కోసం ఆలోచిస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. 
ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా, సామాజిక వర్గంలోనైనా చదువుకున్న మధ్యతరగతి వర్గం మౌనంగా ఉండే సమాజానికి దేశానికి భవిత ఉండదు. ముఖ్యంగా దళితుల విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. 
ఈ కులాల ప్రజలకు భూమి లేదు, వ్యాపారంలో, వాణిజ్యంలో వాటా లేదు, పరిశ్రమలలో స్థానం లేదు. 
దళిత జాతికి ఉన్న ఆస్తి కేవలం చదువుకున్న వాళ్ళే. 
కానీ అట్టడుగు దళిత జ్యాతి శాశ్వత విముక్తి ఇంకా కలగానే మిగిలింది 
పైగా అంబెడ్కర్ ఉద్యమ విజయ ఫలాలు ఒక్కొక్కటిగా చేయి జారిపోతున్నాయి. 
ఇంతవరకు దళితుల పట్ల సమాజం చూపుతున్న వివక్ష నేడు ద్వేషంగా మారిపోయింది.కాబట్టి ఎన్ని చట్టాలు వచ్చినా అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది. 
✍️డా: బి. ఆర్. అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు :
విద్యావంతులు అనేకమంది, ఉద్యోగులు అతికొద్దిమంది అయి వీరంతా రాజకీయ శక్తిగా మారి అధికారంలోకి రావాలని ఓటు అనే శక్తివంతమైన ఆయుధాన్నిచ్చాడు బాబా సాహెబ్. 
ఈ ఆయుధం విలువ దళితులకు తెలియకుండా అగ్రకులాలు చాలా జాగ్రత్త పడుతున్నాయి. వారి సంస్కృతి మనపై రుద్దుతూ మనం ఓటు గురించి ఆలోచించకుండా చేస్తున్నారు. బాబా సాహెబ్ ఆలోచనలు మనదాకా రాకుండా పాఠ్యపుస్తకాలలో కేవలం రాజ్యాంగాన్ని రాసినవాడిగా మాత్రమే పరిచయం చేస్తూ నాలుగు లైన్లు రాస్తూ జాగ్రత్త పడుతున్నారు. 
కుట్రతో మనల్ని చదువులకు కాసిన్ని ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. 
రాజ్యాంగంలో రేజర్వేషన్లతో పాటుగా సమస్త హక్కులు కల్పించాడు బాబా సాహెబ్... 
వాటిని అమలుచేసుకోవడానికి రాజకీయ శక్తిగా ఎదగమన్నాడు. 
దేశంలోని సమస్త సంపదలో 100% సమానవాటా పంచుకోమన్నాడు. 
దళిత ఉద్యోగులు, విద్యావంతులు ఇకనైనా ఆలోచించండి 
బాబా సాహెబ్ పుస్తకాలు అధ్యయనం చేయండి, రాజకీయ శక్తిగా ఎదిగి సమస్త సంపదలో సమాన వాటా మనమే పంచుకుందాం. 
దళితుల, బహుజనుల అభివృద్ధికి శాశ్వత పరిస్కారం దిశగా అడుగులు వేద్దాం. 
అంబెడ్కర్ అంటే కొందరికి దళిత నేత, మరికొందరికి స్వాతంత్ర పోరాట నాయకుడు, ఇంకొందరికి స్వాతంత్రమొచ్చాక కేంద్ర మంత్రి... 
కానీ వీటన్నిటికీ మించి ఆయన ఒక దార్శనికుడు 
భవిష్యత్ తరాన్ని ఊహించిన మేధావి, దశబ్దాల క్రితం ఆయన గుర్తించిన సమస్యలు ఇప్పటికి మన దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి 
వాటిని పట్టించుకోకపోతే ఏమవుతుందో కూడా ముందే హెచ్చరించారు బాబా సాహెబ్ అంబెడ్కర్. 
ఇప్పటికి ఆయన అంటే మీకు చిన్న చూపు ఉందా..? 
అయితే ఆయన కోరుకున్న సమానత్వం విచక్షణ పోనట్టే.. !!
మరి మనమేమి విజయాలు సాధిస్తాం.. !
దేశం ఎలా తలెత్తుకుంటుంది.. !!
ఆయన్ను ఇప్పటికి మీరు ఒక తక్కువ కులం వ్యక్తిగానే చూస్తే అంతకంటే మనకు ఇంకేం సాక్ష్యం కావాలి? 
మనం దేనికి విలువిస్తామో తెలిసిపొఇంది కదా.. !!
మనం ప్రజ్ఞకి, జ్ఞానానికి కాదు కులానికి ఎక్కువ విలువ ఇస్తాం అని.. !!
బహుశా ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించడానికి జాతికి మరో వందేళ్లు పట్టొచ్చు. 
అయినా సరే 
ఆయన చెప్పినట్టు ఇప్పటికి నేను కూడా గర్వాంగా చెప్పగలను 
నేను నా దేశం.. ఇందులో "నాకు నా దేశమే ముఖ్యం"
మేర భారత్ మహాన్, 
వందేమాతరం, 
✊️జై భీమ్✊️ 
✊️జయహో డా : భీమ్ రావ్ రాంజీ  అంబెడ్కర్ సాబ్ 
✊️జయహో బహుజన✊️


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
శ్రామిక జాతికి  మే డే దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చారిటబుల్.ట్రస్ట్, మే డే.శుభాకాంక్షలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
ఇదీ వాటర్‌ గ్రిడ్‌