ఇది పాఠమా ? గుణపాఠమా ?

కల చెదిరిపోవచ్చు......
వర్షం రాకపోవచ్చు.......
సినిమా ఆడకపోవచ్చు.......
ఇవన్నీ మనం ఊహించవచ్చు......


కాని


ప్రపంచం ఆగిపోతుందని ఎవరైనా ఉహించారా ?


ఉహించనిది జరగడమే జీవితం అనుకుంటే .....
జరిగిన, జరుగుతున్న పరిస్థితిని
విపత్తు అనాలా, 
వినాశనం అనాలా లేక 
మహమ్మారి వికటాట్టహాసం అనాలా ?


తిన్నది అరక్క చేసే గొడవల వల్ల ఎదురయ్యే  కర్ఫ్వూ చూశాం... 


అమ్మవారు పోసిందనో, అనుకోని జబ్బు వచ్చిందనో, అయినవారు దూరం అయ్యారనో స్వీయ గృహ నిర్భందం చూశాం


కాని ఇవన్నీ కలకలిపి ఒకేసారీ అనుభవిస్తు, ఆచరించడం బహూశా జీవితంలో ఇదే మొదటిసారెమో !


మునుపెన్నడు లేనివిధంగా 
సంస్కృతి సాంప్రదాయలపై చర్చలు, 
శుచి శుభ్రతలపై అవగాహనలు
తినే తిండిపై నియంత్రణలు.......
అడుగుతీసి అడుగు వేయడానికి నిబంధనలు.... 


వెరసి కొత్త లోకంలో జీవిస్తున్న అనుభూతి...........


ఇది పాఠమా ? గుణపాఠమా ?


ఒక్కసారి మార్చి 22 నుండి చూసుకుంటే.......


పబ్బుల్లేవు, క్లబ్బులు లేవు
బార్లు లేవు, రెస్టారెంట్లులేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!


ఫాస్ట్ ఫుడ్స్ లేవు, కేఫ్ లు లేవు 
పానీపూరీ,  మిర్చి, పిజ్జాలు లేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!!!!


బళ్ళు లేవు, బంకులు లేవు
పెట్రోలు, డీజిలు చింతలేలేవు
బ్రాండెడ్ బట్టలు లేవు
బరి తెగింపులు అసలే లేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!!


చీటికి మాటికి షాపింగులు లేవు
సినిమాలు లేవు, షికార్లు లేవు
బిర్యానీలు లేవు, పార్లర్లు లేవు 


అయినా జీవితం ఆగిపోలేదు..........


గుళ్ళులేవు, బడులు లేవు
చర్చిలు, మసీదులు లేవు
పూజలు లేవు నమాజులు లేవు
ప్రార్ధనలూ లేవు, 


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!


కాలుష్యం లేదు, కలహాలు లేవు
కల్లబొల్లి మాటలతో టైంపాసులు లేవు 
యాత్రలు లేవు, తీర్ధ యాత్రలు లేవు
టూరిజం అంటూ టూర్లు లేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!!!


అయినదానికి, కానిదానికి అపాయింటుమెంట్లు తీసుకుని
వేలకి వేలు తగలేసె రోగాలు.... డాక్టర్లు చెప్పకుండానే మాయమయ్యాయి.....ఎలా ?


ఇరుగు, పొరుగు అంటూ బాంధవ్యాలు మొదలయ్యాయా... 


పనివాళ్ళు రాకపోయినా పనులేవి ఆగలేదు........ఎలా ?


మంచితనం. మానవత్వం మబ్బు పట్టిన ఆకాశంలా, ముంచెత్తె వరదలా వెల్లువెత్తాయి.......ఎలా?


డబ్బులున్నా ఏమి కొనలేరు
బయటకెళ్ళె ధైర్యం చేయలేరు
నిత్యావసరాలు తప్ప
నిర్జీవమైన వాటిని కొనలేరు.......



ధనవంతుడు, సామాన్యుడు అంతా ఒక్కటే అని ఎవరైనా చెబుతున్నట్టుందా ?


ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి.....


మనకి మనమే అంతర్మధనం చేసుకోవాల్సిన సమయమిది..... 


కుటుంబ వ్యవస్థ బలోపేతమైందా ?
అన్యోన్యత పెరిగిందా ?
బంధాలు బలపడ్డాయా ?
పిల్లలపై వాత్సల్యం పెరిగిందా ?
ఆరోగ్యంపై శ్రద్ద పెరిగిందా ?
ఆలోచనల్లో పదును పెరిగిందా ?
డబ్బుపై వ్యామోహం తగ్గి
ప్రాణమున్న వాటిపై ప్రేమ పెరిగిందా ?


పైవాటన్నింటికి కారణం ఏదైనా మనం మరచిన మంచి కాలాన్ని గుర్తుకు తెచ్చిందా... 


ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం బహూశా ఇదేనేమో ? 


ఆలోచించండి
అచరించండి
అనుభవించండి!


భవిష్యతరాలకు మంచి బాట వేయండి.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు