కరోనా వైరస్ నశించాలని శివలింగ పూజలు చేసిన వీరశైవ లింగాయత్ లు

కరోనా వైరస్ నశించాలని శివలింగ పూజలు చేసిన వీరశైవ లింగాయత్ లు


ఎమ్మిగనూర్,ఏప్రిల్,14 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు మండలం పరిధిలోని కే. తిమ్మాపురం గ్రామం లో మంగళవారం ఉదయం 11గంటలకు ఎమ్మిగనూరు తాలూకా వీరశైవ లింగాయతల సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి. సి. నాగరాజు  మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని, ప్రజల్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారినీ సమూలంగా నాశనం కావాలని, ఈ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలై మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపారు.కరోనా వైరస్ రోగులు త్వరగా కోలుకోవాలని జగద్గురువుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 7గంటలకు కే.తిమ్మాపురం గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర దేవాలయం నందు భోళాశంకరుడినీ కోరుతూ వీరశైవ లింగాయతులందరూ సామూహిక ఇష్టలింగ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇప్పటికైనా మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న covid 19 వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసి కలిసిపోకుండా ఆ భగవంతుడైన శివపరమాత్మ డే కాపాడాలని వీరశైవ లింగాయత్ లు కోరుతున్నారు.ఇప్పటికైనా మన భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పాజిటివ్ కేసులు గా లేనట్లు చూడాలని ఆ శివపరమేశ్వరుని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీరశైవలింగాయత్ లందరూ, అలాగే గ్రామ పెద్దలు,భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా భారతదేశానికి శాంతి చేకూరాలని వీరశైవ లింగాయత్ లు అందరూ కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీరశైవ లింగాయత్ అధ్యక్షులు బసన్న, కార్యదర్శి పెద్ద రామలింగప్ప, సలహాదారు హోటల్ రామలింగప్ప, డాక్టరు మల్లేషప్ప, శివ, బద్రి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు