కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు : సుధాకర్‌బాబు

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు : సుధాకర్‌బాబు
విజయవాడ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తున్నట్టు గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ5, ఏబీఎన్‌ రాధాకృష్ణ సంఘవిద్రోహ శక్తులని సుధాకర్‌బాబు వ్యాఖ్యానించారు. అన్యాయమైన రాతలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సుధాకర్‌బాబు విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత ద్రోహి అని తెలిపారు. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే విమర్శలు చేయడం దారుణమని అన్నారు. దళితులు ఎన్నికల కమిషనర్‌గా ఉండకూడదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవం చేసుకుందని.. దానిని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులను అవమానించేలా నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన నిమ్మగడ్డ రమేష్‌పై కోర్టుకు వెళ్తామని చెప్పారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు